నందమూరి ఫ్యామిలీ అంటే తెలుగు జనాలకు విపరీతమైన అభిమానం. అసలు ఇప్పటికీ అన్నగారంటే తెలియని ఊరు లేదు. ఇరవైఏళ్లక్రితం మరణించినా ఆయన ఇప్పటికీ తెలుగు
వెలుగే! ఐతే అబిడ్స్లోని రామకృష్ణ థియేటర్లో క్యాంటీన్, పార్కింగ్ లీజు వ్యవహారంలో ఎర్రమంజిల్ కోర్టు జయకృష్ణకి శిక్ష విధించిందనేది ఇప్పుడు సంచలనం కలిగించే విషయం. ఎన్టీఆర్
సంతానంలో జయకృష్ణ బాగా లోప్రొఫైల్ మెయిన్టైన్ చేస్తారు. ఈ శిక్షపై అప్పీల్కి వెళ్లొచ్చు..శిక్ష రద్దు కూడా కావచ్చు కానీ ఈలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. తెలుగుచిత్రసీమని
ఏలిన కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇలా జరగడం శోచనీయం. ఇది తప్పకుండా అందరి దృష్టినీ ఆకర్షించే విషయమే!
Comments
Post a Comment