వైఎస్ జగన్ పాదయాత్రలోనే 2019లో తమ పార్టీ తరపున పత్తికొండ నుంచి పోటీ చేసే ఆభ్యర్ధి ఎవరో అనౌన్స్ చేసేసాడు. దీనికి ఓ సెంటిమెంట్ ముడిపడి ఉంది..2014 ఎన్నికలకు ముందు కూడా ఇలానే ఓదార్పు యాత్రలోనే డోన్ నుంచి బుగ్గన రాజేంద్రకి సీటు అనౌన్స్ చేశాడు. అలానే ఆయన గెలవడం..అసెంబ్లీలో టిడిపి అంకెలను తప్పు బడుతూ మంచి ప్రసంగాలు చేయడం చూశాం.
ఇప్పుడు అలానే చెరుకులపాడు శ్రీదేవిని పార్టీ అభ్యర్ధిగా అనౌన్స్ చేశాడు జగన్. ఈమె భర్తనే ప్రత్యర్ధులు నరికి చంపండంతో అప్పట్లోనే జగన్ శ్రీదేవి భవిష్యత్తు తమదేనంటూ ప్రకటించాడు.ఇప్పుడు అలానే సీటుకి అభ్యర్ధిని చేశాడు..ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే అని ఫ్యాన్స్ చెప్పుకోవచ్చు..
ఐతే సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఓరకంగా బ్యాడ్ కూడా..ఎందుకంటే మరి జగన్ 2014లో తొలి అభ్యర్ధిని ప్రకటించడం ఆయన గెలవడం జరిగాయి కానీ...పార్టీ ఓడిపోయింది..కానీ ఈసారి అలా కాదు ఖచ్చితంగా గెలుపు మాదే అని ఫ్యాన్స్ చెప్పుకోనవచ్చు.
Comments
Post a Comment