పాదయాత్రతో కేసులు కూడా మాఫీ అవుతాయా..ఏం చెప్పారు పత్తిపాటి సర్!


ఇప్పటిదాకా పాదయాత్రలు చేసినవాళ్లు రాజకీయంగా ఎదుగుతారని..ఎక్కువశాతం ముఖ్యమంత్రులుగా అయ్యారని అనుకుంటున్నాం..ఐతే ఇప్పుడు అలా చేస్తే కేసులు కూడా మాఫీ అవుతాయని శ్రీమాన్ ఏపీ మంత్రివర్యులు సెలవియ్యడం భలే తమాషా..ఏదోటి చేసి కేసులనుంచి బైటపడేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నాడని..పత్తిపాటి పుల్లారావ్ గొట్టాల ముందు జగన్రహస్యం బైటపెట్టడంతో జనమంతా  ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..

అబ్బా అబ్బా!ఏం మనిషి..ఏం తెలివి! వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాన్స్ అయితే అసలు ఈ ప్లాన్ పత్తిపాటికి ఎలా లీకైందంటూ జుట్టు పీక్కుంటున్నారు. ఛ మా బాస్ మరీ ఇంత ఓపెన్ టైప్ అయితే ఎల ా కనీసం ఓ ఆర్నెల్లపాటైనా   ఈ సీక్రెట్ ఎందుకు కాపాడుకోలేకపోయారంటూ పొర్లి పొర్లి ఏడుస్తున్నారు. ఐతే మంత్రిగారు ఇంకో ముక్తాయింపు కూడా ఇచ్చారు. ఇలా జగన్ మాస్టర్ ప్లానేసినా..జనం మాత్రం నమ్మడం లేదట..మళ్లీ ఇక్కడ జనం నమ్మకంతో కేసుల మాఫీకి ఎలా లింకో మాత్రం ఆయన చెప్పలేదు..పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తోన్న హామీలు నీటిమీద రాతలు అని తేల్చేసారు..2019 తర్వాత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (ysr congress) కన్పించదట.. ఆ మాట నిజమే అయితే..మరి ఇప్పుడర్జంట్‌గా ఆ విషయం చెప్పాల్సి న  అవసరం ఏముంది..జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకి రెస్పాన్స్ బావుందనేది అందరికీ తెలిసిందే..(ఇదేదో మాట వరసకు రాసింది కాదు) అక్కడ ఉన్న జనాన్ని చూస్తే తెలుస్తుంది.

ఐతే జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలికకూ కేసుల మాఫికి లింక్ పెట్టడం మాత్రం ప్రజలు నమ్మరు..ఎందుకంటే అసెంబ్లీకి రాకపోతే కేసులు మాఫీ..డిల్లీకి వెళ్తే కేసులు మాఫీ, లండన్ కి వెళ్తే..అక్కడా అదే తంతుచేశాడు..ఢిల్లీకి సంబందించిన ఎవరైనా పెద్దోళ్లు వస్తే కలిస్తే కేసుల మాపీకి అని పదే పదే చెప్పడం వలన వాస్తవం పలుచన అవుతుంది తప్ప మన గొప్ప మాత్రం పెరగదు మినిస్టర్ సర్!

Comments