మేమూ మనుషులమే! ఒక్క రోజే కోహ్లీ, స్వాతి అక్రోశం


క్రికెట్, సినిమా ఈ రెండూ మన లైఫ్‌లో విపరీతంగా చొచ్చుకుపోయాయ్. అలాంటి క్రేజీ రంగాలనుంచి ఒక్కరోజే ఇద్దరు సెలబ్రెటీలు మేమూ మనుషులమే కాస్త కనికరించండి అంటూ వాపోయారు..అఁదులో ఒకరు స్వాతి..మన తెలుగమ్మాయే అయినా తమిళ  సినిమాల్లోనూ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే ఈమె చేసిన హీరోలతో కలిపి లింక్ పెట్టి రాతలు రాసేవాళ్లు ఎక్కువయ్యారని స్వాతి బాగా వాపోయింది. ఇలా చేయడంతో మీకు లైకులు, రేటింగ్ రావచ్చేమో కానీ మా మనసులు ఎంత గాయపడతాయో తెలుసా అంటూ బాధపడింది. ఇది వ్యక్తిగతంగానే కాదు..మొత్తం కుటుంబసభ్యులపై కూడా తీవ్రప్రభావం పడుతోందని..ఇదెందుకు అర్ధం చేసుకోరని ప్రశ్నించింది స్వాతి.

నిజమే కాస్త అందంగా ఉంటే చాలు ఎవరో ఒకరితో లింకులు పెట్టడం..పట్టించుకున్నా..పట్టించుకోకపోయినా అదే పనిగా రాసుకుంటూ పోవడం..ఇలా ఎన్నాళ్లు జనం చూస్తున్నారు కాబట్టి మేం రాస్తున్నాం అనే పద్దతి మంచిదికాదు..ఇది తెలుసుకోవాలి ఎవరైనా(మాతో సహా)

ఇక రెండో సెలబ్రెటీ విరాట్ కోహ్లీ,. సిరీస్ తర్వాత సిరీస్..వరసగా ఎన్నాళ్లిలా మేం మనుషులం కాదా..! శ్రీలంకతో టెస్ట్ ఐపోగానే మూడోరోజుకి సౌతాఫ్రికా సిరీస్ ప్రారంభం కాబోతుంది..ఈ బ్యాక్ గ్రౌండ్లోనే కోహ్లి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియాపై ఇలా మండిపడ్డాడు. అసలు ఫారిన్ టూర్‌ వెళ్లాలంటే కనీసం నెల రోజులు టైమ్ ఉంటుందనుకున్నాం కానీ ఇలా వెంట వెంటనే వెళ్లడమంటే ఎలా కుదురుతుంది..మేమేం మెషీన్లం కాదు కదా..మాకు విశ్రాంతి  అక్కర్లేదు అని ఎందుకు అనుకుంటారో తెలీదు అని చిరాకు పడ్డాడు.











Comments