అబ్బా..అందమంటే నీదే! మానుషికే మిస్ వరల్డ్ కిరీటం


అందమంటే నీదే అంటూ మరోసారి ప్రపంచం భారత సుందరి ముందు మోకరిల్లింది. మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి)పోటీల్లో ఇండియన్ బ్యూటీ మానుషి చిల్లార్(షిల్లార్) క్రౌన్ ఎగరేసుకుపోయింది. 

గత రెండు మూడేళ్లలో కూడా ఇలానే ఫైనల్ రౌండ్ వరకూ మన భామలు వచ్చినా ఆఖర్లో దెబ్బతిన్నారు..ఈసారి మాత్రం మానుషి కిరీటం దక్కించుకోవడంతో ఫ్యాషన్ వాల్డ్‌లో మరోసారి ఇండియన్ ఫ్లాగ్ రెపరెపలాడింది.కింద ఆ క్రౌనింగ్ మూమెంట్ వీడియో ఉంది చూడండి

( స్టే ట్యూన్డ్ ఫర్ అప్‌డేట్స్)
2000 సంవత్సరంలో ప్రియాంకచోప్రా..అంతకు ముందు అంటే 1994లో ఐశ్వర్యారాయ్ ..తర్వాత ఇలా మిస్ వరల్డ్ కిరీటం ఇండియాకి దక్కడం ఇది 3వసారి. మొత్తంగా ఆరో భారత సుందరి. 


ఇక రన్నరప్స్‌గా మిస్ మెక్సికో..మిస్ ఇంగ్లండ్ రెండు మూడు స్థానాలు దక్కించుకున్నారు. ఈ పోటీలు  ఈసారి చైనాలో జరగడం విశేషం.
ఈ హర్యాణా బ్యూటికి 20ఏళ్లు..తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే..తను కూడా డాక్టరే కాకపోతే ఇంకా చదువు పూర్తి కాలేదు..అంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ లా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సుందరి ప్రత్యేకతలు చూస్తే ఆశ్చర్యపోకతప్పదు.మన రాజారెడ్డి రాధారెడ్డి, కౌశల్యా రెడ్డి దగ్గర కూచిపూడి నేర్చుకుంది. నేషనల్ డ్రామా స్కూల్‌ లో కూడా  ట్రైనింగ్ తీసుకుంది..మెనుస్ట్రవల్ హైజీన్ అంటే నెలసరి సమయంలో పరిశుభ్రత గురించిన ఓ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్టులో ప్రస్తుతం మానుషి చిల్లార్ ఉంది..దాదాపు 20 గ్రామాలకు వెళ్లి అలా 5వేలమంది మహిళలకు ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పటికే అవగాహన కల్పించింది..సో ఈ బ్యూటీ హేజే విజన్ ఆల్సో..


Comments