ఏపి అసెంబ్లీలో ఇవాళ ఇద్దరు టిడిపి లీడర్లు బాహాబాహీకి దిగినట్లు సాక్షాత్తూ వారికి వత్తాసు పలికే ఆంధ్రజ్యోతే ఓ కథనం రాసింది. కరణం బలరాం, గొట్టిపాటి రవి కుమార్ ఇద్దరూ ఎదురెదురూ పడగా, కేకలు వేసుకుంటూ ఎగబడ్డట్లు ఆ స్టోరీ సారాంశం..ప్రకాశం జిల్లా మంత్రే అయిన శిధ్దా రాఘవరావ్ అడ్డుకున్నా ఆగలేదట..ఇంకాస్తమంది మంత్రులు..ఎమ్మెల్యేలు వచ్చి లాక్కునిపోయేసరికి ఆ గొడవ అక్కడికి ఆగిందని టాక్
ఐతే వీళ్లిద్దరికీ పడదని తెలిసి కూడా..చంద్రబాబు రవిని పార్టీలోకి తీసుకోవడం అందరికీ తెలిసిందే..ఆ తర్వాత పలు వేదికలపైనా ఇలానే రెచ్చిపోయారు..ఇద్దరు టిడిపి చోటా లీడర్లు ఆ గొడవల్లో చచ్చిపోయారు కూడా..ఐనా ఈ రభసకి ఫుల్స్టాప్ ఎలా పెట్టాలో బాబు బుర్రకి తట్టని ప్రశ్న అనుకుంటా..! ఎందుకంటే ప్రతిసారీ ఇద్దరి ఎక్స్ప్లనేషన్ తీసుకోవడం తప్ప ఏం చేయగలరాయన...మహా అయితే పార్టీలోంచి డిస్మిస్ చేయడం తప్ప..ఆ తర్వాత చేర్చుకోవడానికెటూ వైఎస్సార్ కాంగ్రెస్ , కాంగ్రెస్లు రెడీగానే ఉఁటాయ్...లేదంటే మరో పువ్వు పార్టీ నేతల కోసం వేట సాగిస్తోంది కాబట్టి ఆ వైపూ చూస్తారు..ఇక్కడ ఇది కాదు సమస్య...ఇష్యూ పరంగా సమస్యలున్న లీడర్లను ఒకేపార్టీలో ఉంచగలరు కానీ...ఏకంగా చంపుకునేంత..దాడి చేసుకునేంత సమస్యలు ఉన్నప్పుడు దాదాపుగా దూరం పెడితేనే ఏ పార్టీకైనా హాయిగా ఉంటది..కానీ పార్టీని స్ట్రాంగ్ చేస్తున్నామనుకుంటూ ఇలాంటి లీడర్లను చేర్చుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది మరి
Comments
Post a Comment