అమరావతికి అమితాబ్, దీపికా పడుకునే! బాబుగారి చేతుల మీదుగా అవార్డ్


పద్మావతి సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతోన్న దీపికా పడుకునే అమరావతికి రానుంది. ఇంతవరకూ ఏ తెలుగు సిటీని విజిట్ చేయని దీపికా..ఈసారి గుంటూరు, విజయవాడ వాసులకు దర్శనమిస్తోందంటే అది సినిమా ప్రియులకు పండగే! హైదరాబాద్‌ అంటే ఈ సిటీనే వేరు. ఎవరైనా వెంటనే వచ్చేస్తారు..కానీ విజయవాడ లాంటి నగరాలకు బాలీవుడ్ బ్యూటీలు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవ్.

ఇంతకీ దీపికా ఎందుకొస్తుందంటే..అవార్డు తీసుకోవడానికి..ఇదేదో ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు కాదు..సోషల్ మీడియా అవార్డ్స్ అట మరి ఈ ఆలోచన చంద్రబాబు బ్రెయిన్‌ఛైల్డో..మరింకెవరు పుట్టించారో కానీ..సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ లేదంటే పాపులర్ అయిన పర్సనాలిటీలకు ఇస్తారట. ఈ ఏడాది నుంచే ప్రారంభించారనే అనుకోవాలి..ఇలా ప్రభుత్వమే సోషల్ మీడియా అవార్డులు ఇవ్వడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదు..మరి ఇది నిజంగానే జరుగుతుందోే లేదో కానీ, దీపికా పడుకునే అయితే ఆల్రెడీ నవంబర్ 19న అమరావతికి రాబోతోన్నట్లు ఫిక్స్ చేసేసిందట.

మోస్ట్ పాపులర్ ఇండియన్ యాక్ట్రెస్ గా దీపికా,  మోస్ట్ పాపులర్ ఇండియన్ ఆన్ సోషల్ మీడియాగా అమితాబ్ బచ్చన్ , మోస్ట్ ఏక్టివ్ సౌతిండియన్ యాక్టర్ గా రానా దగ్గుబాటి ఇతర పురస్కారాలు అందుకోబోతోన్నారట. ఇంకా ఇలాంటి కేటగరీలు దాదాపు 30వరకూ ఉన్నాీయట..చూడబోతే నవంబర్ 19న తెలుగుజనాలకి పండగలానే కన్పిస్తుంది. నిజంగా అవార్డులు ప్రకటించినోళ్లంతా వస్తారో..లేక ఇంటర్నెట్‌ని వాడుకుని లైవ్‌లో సందేశాలు పెడతారో..అది అలా ఉంచితే..ఇంతవరకూ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు ప్రకటించకుండా ఇలాంటి ఈవెంట్లు
కండక్ట్ చేయడంపై ఖచ్చితంగా విమర్సలు బయల్దేరక మానవ్.

Comments