రాజాపేట శివారులొ ఏడుగురు ఇలా నిద్రలొనే ప్రాణాలు పొగొట్టుకున్నారంటే..మొదట ఆ కుటుంబానికి ఉన్న ఆర్ధిక పరమైన ఇబ్బందులు, ఆ తర్వాత ఇంకేవైనా తగాదాలు..యజమానితొ గొడవలు..ఇలా అన్ని కారణాలూ వెతకాలి కదా.వాటిలొ సహేతుకమైన దిశలొ పొలీసులు దర్యాప్తు చేస్తారు పొస్ట్ మార్టమ్ నివేదికలొ కూడా ఎలా చనిపొయారొ తెలీనప్పుడు అది ఆత్మహత్య ఎలా అవుతుంది..ఎందుకంటే..ఉట్టిగా నిద్రలొనే ప్రాణాలు కొల్పేయరకంగా సూసైడ్ చేసుకొవడమనే( అఁటే పొస్ట్మార్టమ్ లొ కూడా తెలియకుండా) స్థాయికి ఈ పేదజీవులు ఎదిగారా..?
అందుకే మీడియా ముందు సుద్దులు చెప్పడం మానేయాలి. తీర్పరి పాత్రలను ఆపేయాలి..పొలీసులు ఏదైనా లేట్ చేస్తే ఆ విషయంపై దర్యాప్తు చేయమని ప్రేరేపించాలి కానీ..మాకు మేమే పొస్ట్ మార్టమ్ చేస్తాం..రిపొర్టులిస్తాం అఁటే కుదరదు కదా
Comments
Post a Comment