కొత్తపల్లి గీతా..బొంకమాక ఇక..!


పార్టీ మారి ఎన్నాళ్లైందో ఆమెకే గుర్తులేదు..గుర్తొచ్చినప్పుడల్లా రాజకీయంగా పదవినిచ్చిన పార్టీని తెగడటమే ధ్యేయంగా పెట్టుకుందీ ఎంపి. సడన్‌గా ఇప్పుడు ఆమెకి ఏం గుర్తొచ్చిందో ఏమో కానీ...వైఎస్సార్ కాంగ్రెస్‌లో మహిళలకు గౌరవం లేదంటూ విరుచుకుపడింది. ఎందుకు ఆ మాట అనాలనిపించిందో కానీ..అసలు ఇప్పుడున్న పార్టీలోఆమెకి ఏ రేంజ్ గౌరవం లభిస్తుందో చెప్తే అప్పుడు ఆ మాటకి విలువ ఉండేది. 

బహుశా గిడ్డి ఈశ్వరి టిడిపిలోకి జాయినైన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి..మీ ఫీలింగ్ ఏంటి అని అందరినీ మీడియా గొట్టాలు అడిగి ఉంటాయ్. ఆ సందర్భంలోనే ఈమెగారు కూడా తమ అమూల్యమైన అభిప్రాయం వెల్లడించారు కాబోలు

నిజమేదైనా పార్టీ మారింది కదా..రాజీనామా ఎప్పుడు అంటే ఆమె చెప్పిన సమాధానం మామూలుగా లేదు ఎందుకంటే..పార్టీకి ఎన్నికలకు ముందే రాజీనామా చేస్తుందట..ఇలాంటి ఆన్సర్ గతంలో ఎవరైనా ఇచ్చారంటారా..?
అసలు ఎన్నికలకు ముందు నువ్ రాజీనామా చేయకపోయినా..చేసినా..అదెటూ రద్దయ్యేది..అసలు అప్పటికి నీకు సీటు ఇస్తారో లేదో ముందే తేల్చుకోవాలి కదా..! అన్నట్లు కొత్తపల్లి గీత గారి ఖాతాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి ఎగ్గొట్టిన కోట్ల సంగతి మాత్రం ఎవరూ అడగరు.  ఆ సంగతి అడిగితే మాత్రం అదంతా తప్పు..తప్పుడు కేసు అంటారే తప్ప బ్యాంకులు ఎందుకు నోటీసులు ఇస్తున్నాయో మాత్రం చెప్పరు. ఇలా ఈ కేసులన్నీ ఎన్నాళ్లు నడుస్తాయో కానీ ఈలోపు పవర్ పగ్గాలు  ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ చెంతన చేరతారేమో చూడాలి

Comments