మన దేశంలో రూల్స్ పాటించకపోవడం ఓ ఫ్యాషన్..ఓ దర్జా..ఇంకా మాట్లాడితే ఓ హక్కు కూడా..! ఇతర దేశాల్లో క్యూలో నిల్చున్న ప్రధానమంత్రులు, అధ్యక్షులకి సంబంధించిన వార్తలు పెద్దగా ఎవరూ పట్టించుకోరు..అలానే రాంగ్ సైడ్లో వెళ్లినా, ఇతర నిబంధనలు అతిక్రమించినా వెంటనే జరిమానా కడుతుంటారు..అవి మనకి న్యూస్..అక్కడ అవే న్యూస్లా ఎందుకు వేస్తారంటే అంత స్థాయి వ్యక్తి నేరం చేయడమేంటనే కోణంలో..కానీ మనకి మాత్రం చూశారా ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఫైన్ కట్టారు అనే కోణంలో కథనాలు సాగుతాయ్.
ఇప్పుడు స్టోరీ అంతా దేని గురించంటే, ఖేర్కీ డౌలా టోల్ ప్లాజా అని గుర్గావ్ సైబర్సిటీలో ఓ టోల్గేట్ ఉంది. అక్కడ రెండు వారాల క్రితం ఫీజు కట్టమన్నందుకు ఓ లేడీపై దౌర్జన్యం చేశాడో మగాడు. మగాడని ఎందుకు అంటున్నామంటే..అలా ఫీజు కట్టకుండా ఫ్రీగా పాసేజ్ అడగడమే వాడి మగతనంలా వాడు ఫీలయ్యాడు కాబట్టి..పైగా సదరు లేడీపై చేయి చేసుకున్నాడట..అక్కడక్కడా తడిమాడట..బతిమాలినా వినకుండా ఇలా చేయి చేసుకున్నాడట
సదరు మగోడి పేరు కుల్దీప్ యాదవ్, ఇతగాడు చెప్పే కారణం శికోహ్పూర్ గ్రామానికి ఈ టోల్ గేట్ నుంచి మినహాయింపు ఉందట..ఐతే ఈ లేడీ ఎంప్లాయీ జస్ట్ ఐడీ కార్డు చూపించమని అడిగింది...బహుశా చూపిస్తే పంపించేదేమో కూడా..ఐనా డాక్యుమెంట్లు అడిగినంత మాత్రాన బండబూతులు తిట్టడం కొట్టడం ఇవన్నీ నాగరికుల లక్షణాలైతే కాదు.. ఇక పోలీసులు వచ్చారు..ఏం చెప్తారో ఊహించండి..అవును అదే..ఆ మాటే చెప్పారు.
" ఎంక్వైరీ జరుగుతోంది"
Comments
Post a Comment