ఇవాళ రోజా మాట్లాడిన తీరు ఎవరికైనా ముచ్చట వేస్తుంది. టిడిపిలో ఉన్నా..ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్నా రోజా స్టైలే వేరు..తనకంటూ నిజంగా ఓ స్టైల్ క్రియేట్ చేసుకుంది. పవన్ కల్యాణ్ డైలాగులకు ఇంతవరకూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపు నుంచి సరైన కౌంటర్ ఒక్కటి పడలేదు అనుకుంటుండగానే..రోజా ఉతికి ఆరేసింది..అసలు పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నిజంగా ఆమె మాటలు వింటే..ఇంకేదో సెటైర్లు వేయాల్సిందే కానీ...ఆమె మాట్లాడినదాంట్లో తప్పు పట్టడం ఈజీ కాదు.
"జన సేన కాదు...భజన సేన..తల్లి టిడిపి పిల్ల టిడిపి అంటూ కొత్త ఈక్వేషన్ కాయిన్ చేసింది..అసలు చిరంజీవిని మోసం చేశారు అని ఎవర్నో వదలను అనడం కాదు. ముందు మోసం చేసింది నువ్వే"నంటూ డైరక్ట్గా ఎటాక్ చేసింది రోజా..నిజమే..ఆయన ఈరోజుకీ పిఆర్పీలో పదవి తీసుకోలేదని చెప్తాడు...యువరాజ్యానికి అధిపతి అంటూ ఓ అధ్యక్షపదవి తీసుకుని కాంగ్రెస్ నేతల పంచలు ఊడదీస్తానంటూ ఊగిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది..ఆ మాట తర్వాత..ఆయనగారి అన్నగారేమో కాంగ్రెస్ సముద్రంలో కలిసిపోయారు..ఈయనగారేమో పత్తా లేకుండా పోయాడు..తర్వాత జగన్ గురించి చేసిన ప్రతి కామెంట్కీ కౌంటర్ ఇచ్చింది రోజా..ఇలా పాయింట్ టు పాయింట్ పవన్ కల్యాణ్కి కౌంటర్ ఇవ్వడమే కాకుండా ఎడ్జ్ కూడా సాధించింది.
(వీడియో క్రెడిట్స్ ఎన్టివి)
అధికారం లేకుండా పనులు ఎలా చేస్తారో చెప్పాలంటూ అడగడం బావుంది..ఎందుకంటే..అదేదో పెద్ద మహానుభావుడిలా పవన్ గారు రెండ్రోజుల నుంచి అధికారం ఇస్తేనే సమస్యలు తీర్చుతా అనడం నచ్చలేదంటూ బిల్డప్ ఇస్తున్న పవన్..అసలు అధికారికమైన ఏ ఆదేశమైనా..పదవులు లేకుండా ఎలా చేయగలరో ఆయనే చెప్పాలి..ఇవాళ రోజా అదే అడిగింది..శభాష్..కనీసం పార్టీలోని పెద్ద పెద్ద తలకాయలే అడగలేని ప్రశ్నలు జనసేన పవన్ కల్యాణ్ని అడగడం ద్వారా వైఎస్సార్సీపీకి రోజా ఎంత అవసరమో మరోసారి ప్రూవ్ చేసుకుంది.
Comments
Post a Comment