రోజా చెప్తోంది నిజమేనా


ఈ మధ్య రోజా బాగా యాక్టివ్ అయింది ఓ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో నిరంతరం అధికారపక్షానికి కౌంటర్ ఇవ్వగలిగే
సత్తా తనకే ఉన్నట్లు ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది కూడా..ఇప్పుడుతాజాగా ఆమె చేసిన ఓ కామెంట్
చర్చకి దారి తీస్తోంది. అటు పవన్ కల్యాణ్ గుండుపై సెటైరికల్ కామెంట్ తో పాటు..జగన్ రండి అంటూ టిడిపి లీడర్లకి ఆహ్వానం పలికితే టిడిపి ఖాళీ అవుతుందంటూ మాట్లాడిందామె
ఇది పవన్ పై చేసిన సునిశిత వ్యాఖ్య అయితే, అప్పుడూ ఓసారి టిడిపి గుండు కొట్టించింది..( అంటే అలా ఫీలర్ వదిలిందని) 2014లో ఓసారి కొట్టించింది..2019లో మరోసారి కొట్టిస్తుందని అంటూ చెప్పడం అర్ధం చేసుకోదగిందే
ఐతే జగన్ మోహన్ రెడ్డి తన పార్టీలోకి వచ్చేవాళ్లని రాజీనామాలు చేసి రమ్మంటున్నారు కాబట్టే..ఎవరూ రాీవడం లేదని అదే రాజీనామా వద్దని చెప్తే టిడిపి ఖాళీ అవుతుందని ఆమె చెప్పింది. 
ఇది వాీస్తవంగా మాట్లాడుకుంటే అంత సినమా ఉఁదా అంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు..జగన్ మోహన్ రెడ్డితో నడిస్తే ఉన్న పదవులు ఉండవు..మరి ఎందుకు వస్తారు, అంటే వచ్చే ఎన్నికల్లో గెలిచేపార్టీలోఉండటానికి అని రోజా 
ఒపీనియన్ అయిఉండొచ్చు, కానీ ఇలాంటి కామెంట్లు చేసినప్పుడే వైఎస్సార్సీపీ నుంచి టిడిపికి వలసపక్షుల యానం ప్రారంభమైందని గుర్తు పెట్టుకోవాలి..ఈ సమయంలో ఇలాంటి కామెంట్లు చేసి అవతలివారిని రెచ్చగొట్టే బదులు కాస్త బ్యాలెన్స్‌డ్ గా ఉండొచ్చుగా..ఐతే ఆమె కామెంట్‌లో కాసింత లాజిక్ ని కొట్టిపారేయలేని స్థితిలో టిడిపిఉంది..అది మాత్రం నిజం

Comments