ఎన్టీఆర్ అంత కక్కుర్తి మనిషా


ఇది వింటే నమ్మరు..పైగా అంతటి మహానటుడిపై ఇలాంటి విమర్శలా అంటారు. నిజానికి ఇదే జరిగింది..స్వయంగా నిర్మాత విబి రాజేంద్రప్రసాద్ తన ఆత్మకథలొ రాసుకున్నదే ఇది. ఇంతకీ విషయంలొకి వద్దాం..విబి రాజేంద్రప్రసాద్..వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్ మొదట్లొ నిర్మాతగానే ఉఁడేవారు. ఈయన ఇప్పటి నటుడు జగపతిబాబుకి స్వయానా తండ్రి..ప్రసిధ్ది చెందిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ వీరిదే. పూలరంగడు, దసరాబుల్లొడు కి ఈయనే దర్శకుడు వీటి తర్వాతే ఈయన ఇక దర్శకత్వం కూడా చేయడం ప్రారంభించారు.
ఆరొజుల్లొనే నిర్మాతకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టినవారిలొ ఈయన పేరు కూడా చెప్తారు. జగపతి వారి సినిమాలంటే గొప్ప క్రమశిక్షణతొ తీస్తారనే గవురవం ఉండేది..ఎక్కువగా ఎఎన్ఆర్‌తొ రాజేంద్రప్రసాద్ గారు సిినిమాలు తీయడం కద్దు
అలాంటి రాజేంద్రప్రసాద్ గారు ఎన్టీఆర్, ఎఎన్ఆర్‌తొ కలసి 1978లొ రామకృష్ణులు అని ఒక సినిమా ప్లాన్ చేశారు.
ఇది అన్నపూర్ణావారితొ కలిసి నిర్మించారాయన.




 ఐతే ఈ సినిమా షూటింగ్ ఊటీలొ జరుగుతున్న టైమ్‌లొ ఎన్‌టిఆర్‌కి అవసరం ఉఁడొ లేక రెమ్యునరేషన్‌లొ భాగంగానొ రూ.75వేలు ఇవ్వాల్సి వచ్చిందట..విబి రాజేంద్రప్రసాద్ గారు మద్రాసు నుంచి డబ్బు తెప్పించుకున్నారు. అది ఒ కవర్ రూపంలొ..ఆ కవర్ అలానే ఆయనకి ఇచ్చేశారట. తర్వాత డబ్బు పంపిన రాజేంద్రప్రసాద్ గారి అన్నయ్య లక్షా అందాయి కదా అన్నారట..అప్పటికి అర్ధమైందట ఆయనకి ఒహొ నేను ఇచ్చింది లక్ష అని..వెంటనే ఎన్టీఆర్ ని అడగగా...వెంటనే చెప్పకుండా..కాసేపటికి..అవును అన్నారట..దీంతొ షాక్ తినడం ఈయన వంతు..ఆ తర్వాత అందరిలొ నన్ను డబ్బు అడుగుతారా అన్నట్లుగా..తన ఆగ్రహాన్ని సెట్లపై చూపించేవారట..చివరికి 30రొజుల్లొ సినిమా పూర్తి చేసుకొకపొతే మళ్లీ డేట్లు ఇచ్చేది లేదన్నారట..దీంతొ ఆయన ఎఎన్ఆర్‌కి చెప్పడం ఆయన సహకారంతొ 29రొజుల్లొనే పూర్తి చేయడం జరిగిపొయిందట..తీరా చివరి రొజున మాత్రం అన్నీ మర్చిపొండి అఁటూ వెళ్లారట..ఇది ఆయన స్వయంగా రాసుకున్న దసరాబుల్లొడు ఆత్మకథలొ చూడొచ్చు..ఇవే కాదు..డబ్బు దగ్గర ఎన్‌టిఆర్ కఠినంగా ఉఁటారనే సంగతులు చాలానే ఉన్నాయ్..సందర్భం వచ్చినప్పుడు అవన్నీ చెప్పుకుందాం

Comments