పవన్ బాబా 40 దొంగలు.. నిజమేనా..ఇది..మరి ప్రభుత్వం ఎందుకు పడిపొవట్లేదు


ఇప్పుడు జంప్ జిలానీల క్యాంప్ మరొ చొటికి మార్చబొతున్నారా...తెలుగు రాష్ట్రాల్లొ( ఉన్నది రెండే లెండి)
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు జగన్ పార్టీ నుంచి టిడిపివైపు వెళ్లి ఒక ఏడాదిన్నరకి పైగానే అయింది..పాపం స్పీకర్ గారేమొ తన విచక్షణకు తగ్గట్లు..వాళ్లంతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా అనుకుంటున్నారు..మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవాళ్లు కూడా, వైఎస్సార్సీపీవాళ్లే అనుకుంటున్నారు...అలాంటప్పుడు వాళ్లు అనర్హులుగా ప్రకటించడం అంటే బహుశా..2022లొ చేయవచ్చేమొ...కానీ ఈలొపే జనసేన పార్టీ తమతొ టిడిపి ఎమ్మెల్యేలు 40మంది టచ్‌లొ ఉన్నారని చెప్తున్నారట..
హ్హ హ్హ..ఇదేమైనా నమ్మేలా ఉందా..ఎందుకంటే పార్టీని నడపడానికే దిక్కులేని పవన్ కల్యాణ్ ఇలా 40మంది ఎమ్మెల్యేలను కొనగలడా..సారీ ఆకట్టుకొగలడా..నిజంగా చంద్రబాబు అండ్ సన్ అవినీతి తట్టుకొలేక ఇలా జనసేనతొ టచ్‌లొ ఉన్నారట ఈ 40మంది..లెక్క కూడా ఖచ్చితంగా పక్కాగా ఉందే ఆలీబాబా 40 దొంగల్లాగా...చంద్రబాబా 23 దొంగలైతే..వాళ్లలొ ఇప్పుడు మళ్లీ పవన్ బాబా 40 దొంగలుగా మారతారంట..పాపం ఈ విషయం స్పీకర్ కి తెలిస్తే..ఇంకేమైనా ఉందా..అర్జంట్‌గా విచక్షణ వాడేయరూ...! అందుకే టిడిపి నేతలెవరొ జనసేన చొటా లీడర్లు చెప్పరట..కానీ మాకూ తెలుసు గురూ రాజకీయం..అంటూ హడలగొట్టేస్తున్నారు..ఏం చేస్తాం..ఎవరి యాక్షన్ వారిది.

Comments