దటీజ్..ఎన్‌టీఆర్ బాలయ్య..మొదలైంది చూడండి..!



తెలుగుతెరకు వేలుపు ఎన్టీఆర్..ఈ విషయంలో సందేహమే లేదు. తన అభినయంతో ప్రేక్షకులను రాజకీయ రంగప్రవేశంతో ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసిన నందమూరి తారకరామారావు ఓ మర్రిచెట్టుగా ఎదిగారు. ఆయన జీవితమే ఓ సినిమా అంత మలుపులు, పరిణామాలు, సంఘటనలతో నిండి ఉంది. అందుకే ఆయన పేరిట తీసే సినిమా కానీ..చేసే ప్రయత్నం కానీ ఎవరికైనా ఆసక్తి కలిగించేదే.సరిగా చేయాలి కానీ సూపర్ హిట్టే.
ఎన్టీఆర్ పేరుతో బాలకృష్ణ తేజ దర్శకత్వంలో తలపెట్టిన సినిమా ఇవాళ ప్రారంభోత్సవం జరుపుకుంది. అది కూడా బాలయ్యరీతిలోనే జరుపుకుంది అంటే సరైన పదం..పౌరాణిక పాత్రలో ఉన్న బాలయ్యని చూడటానికి అభినందించడానికి పరిశ్రమకి చెందిన ప్రముఖులు కూడా విచ్చేసిన ఈ తరుణంలో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయ్


ఎన్టీఆర్‌కి భారతరత్న ఎందుకు రాలేదనే అంశాన్ని బుర్రసాయిమాధవ్ చెప్పుకొస్తే...

ఎన్టీఆర్‌ మాయాబజార్ నాటి కృష్ణుడి గెటప్ ఎలా ఫైనలైజ్ అయిందనే  విషయంతో పాటు, తనకి ఆయనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సింగీతం శ్రీనివాసరావ్

నాటి నటి జమున తమ జ్ఞాపకాలను పంచుకుంటూ తన సంతానంపై ఆమె సైటైర్ వేశారు. ఇద్దరు పిల్లలకు ఇంట్రెస్ట్ లేదు అలానే టాలెంటూ లేదు అన్నారామె. టాలెంట్ సంగతి పక్కనబెడితే ఈ వయసులోనూ ఆమె సినిమా ఓపెనింగ్ కి రావడమే కాకుండా ఏకధాటిగా 20 నిమిషాలు ప్రసంగించారు..

నటుడు రాజశేఖర్ కూడా తనకి  ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం చెప్పుకున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్ జీవితగాధ తెరకెక్కడం ప్రారంభమైంది ఇలా అనడంకంటే....ఇక విడుదలయ్యేవరకూ దానికోసం ఎదురుచూపులు ప్రారంభమయ్యాయని చెప్పాలి

Comments