శ్రీదేవిని దివ్యభారతి ఆవహించిందా..రవీనా టాండన్ కి ఎలా తెలుసు

శ్రీదేవి చనిపోయి ఎన్ని రోజులైనా ఆ మరణం, దాని వెనుకున్న మిస్టరీ ఇంకా ఆమె చుట్టూ అల్లుకునే స్టోరీలకు తక్కువ లేవు. ఆమెకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ రవీనాటాండన్ చెప్తోన్న ఓ విషయం మాత్రం విచిత్రంగా అన్పించకమానదు. కొంతమంది మాత్రం ఆమె మాటలను కొట్టిపారేస్తుండగా..మరి కొంతమంది ఆలోచించాల్సిందే అంటున్నారు. అదేమిటంటే..శ్రీదేవిని దివ్యభారతి ఆత్మ ఆవహించిందట.
 దీనికి రవీనాటాండన్ చెప్పొచ్చిన కారణం ఏమిటంటే..
లాడ్లా అనే సినిమాలో రవీనాటాండన్, దివ్యభారతి, అనిల్ కపూర్ నటించారు. మన తెలుగు ఘరానామొగుడికి రీమేక్ అది.. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే దివ్యభారతి చనిపోయింది. ఆ సమయంలోనే శ్రీదేవిని దర్శకనిర్మాతలు అప్రోచ్ అవగా మళ్లీ రీ షూట్ చేసి రిలీజ్ చేశారు. ఐతే శ్రీదేవి ఎంట్రీ ఇచ్చిన సమయంలో  సెట్ పై శ్రీదేవి అచేతనంగా ఉండిపోయిందట. డైలాగులు కూడా చెప్పకుండా బిగుసుకుపోయిందట. అప్పటికప్పుడు యూనిట్ సభ్యుల్లో గాయత్రి మంత్రం తెలిసినవాళ్లు జపం ప్రారంభించిన కాసేపటికి కానీ మామూలు మనిషి కాలేదట. ఇప్పుడు కూడా దివ్యభారతి చనిపోయిన తర్వాతి రోజే..శ్రీదేవి ఇన్నేళ్ల తర్వాత చనిపోవడానికి కూడా దివ్యభారతి ఆత్మే కారణమంటూ రవీనాటాండన్ చెప్పుకొస్తోంది..వింతగా అన్పించినా..కొన్ని అనుభవాలు నమ్మశక్యంగా ఉండవ్..కానీ కొంత సందేహం మాత్రం మిగుల్చుతాయ్.

Comments