యాత్ర పొస్టర్ పడింది..మమ్ముట్టి సెట్ అయిపొయాడంతే..!



దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..వైఎస్సార్ పై తీసే సినిమా అంటూ ఊరిస్తోన్న బయోపిక్ టైటిల్ లుక్ వచ్చేసింది..ఇందులో ఎవరు నటిస్తారా అనే సందేహానికి తెర దించుతూ..మమ్ముట్టి ఫోటోతో వైఎస్సార్ మేనరిజమ్‌తో ఉన్న ఓ ఫోటో విడుదలైంది. ఇందులో ఆయన అచ్చంగా రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెస్తున్నారంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఒక రోజు లోగో..తర్వాతి రోజే ఫోటో రిలీజ్ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా..సినేమా జనం కూడా  ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. టైటిల్ యాత్ర పేరుతో వచ్చిన ఈ పోస్టర్ లుక్‌లో మ్ మమ్ముట్టి తెల్ల దుస్తుల్లో అచ్చంగా రాజశేఖర్ రెడ్డి స్మైల్, స్టైల్ ని దింపేశారు. పోస్టర్ పైనే..కడప దాటి మీ గడపకి వస్తున్నా...మీతో కలసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలని ఉంది అంటూ టైటిల్స్ కూడా ఉన్నాయ్. 

ఏప్రిల్ 9 నుంచి షూటింగ్ మొదలు పెట్టి..ఒకే షెడ్యూల్ లో సినిమా పూర్తయ్యేలాగా ప్లానింగ్ ఉందట. మొత్తానికి సినిమా విడుదలని 2019 ఎన్నికలకు రెండు మూడు నెలలు ఉండగానే చేయొచ్చని టాక్..విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. డైరక్టర్‌గా మహి వి రాఘవ్ ఇందులో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. ఆనందోబ్రహ్మ హారర్ మూవీని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసి హిట్ కొట్టిన ఇతను  ఈ సినిమా చేయాలనుకోవడం వెరైటీనే..టైటిల్ ని బట్టే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపధ్యంలోనే సినిమా నడవనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇందులో కీర్తి సురేష్ ఓ మెయిన్ రోల్ చేయొచ్చనే సంకేతాలు రాగా..పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
మమ్ముట్టి దాదాపు 27 ఏళ్ల తర్వాత తెలుగులొ నటిస్తున్న సినిమా ఇది..ఇంతవరకూ డబ్బింగ్ సినిమాల్లొనే అతనిని చూశాం..ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చేస్తొన్న ఈ సినిమాలొ కూడా అతని సొంత గొంతే వాడతారా లేదా అనేది చూడాలి..ఎందుకంటే..ఏ భాషలొ నటిస్తే..ఆ భాషలొనే డబ్బింగ్ చెప్పుకొవడం అతని ప్రత్యేకత..మళయాళంలొ అత్యధిక చిత్రాలు హీరొగా నటించిన ఘనత ప్రేమ్ నజీర్( 750 సినిమాలు)కి దక్కితే..ఆ తర్వాత 350 సినిమాలతొ ఈయనదే రికార్డు..ఇఁకా నటిస్తున్నాడు కూడా...ఇఁతటి చరిత్ర ఉన్న మమ్ముట్టి..వైఎస్ఆర్ పాత్రలొ నటించనుండటం..ఖచ్చితంగా పాత్రొచితమైన ఎంపికే అవుతుంది..గతంలొ వినొద్ కుమార్ భగీరధుడులొ చేసినా క్లిక్కవకపొవడానికి కారణం..ఆ వెయిట్ అతనికి లేకపొవడమే..

Comments