అభిరామ్ విషయంలో నిర్మాత దగ్గుబాటి సురేష్ నిజంగా అలా అన్నాడా?


శ్రీలేఖారెడ్డి ఉరఫ్ శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి పేర్లేదైతేనేం..ఈమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీ అంతా ఈమె గురించి మాట్లాడుకునేవాళ్లే..ఏకంగా పవన్ కల్యాణ్ నే టార్గెట్ చేసి మాట్లాడినా.. వెనక్కి తగ్గలేదీమె. ఐనా కూాడ శ్రీరెడ్డి రగడతోనే సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఓ కమిటీ అంటూ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఇది నిజంగా పని చేస్తుందా..లేదా అన్నది పక్కనబెడితే, ఓ కదలిక అయితే వచ్చింది. ఇది ఇండస్ట్రీలో క్యాష్ కమిటీ సంగతి అయితే..అసలు సంచలనం అంతా ఆమె బైటపెట్టిన ఫోటోలతోనే..
ఇండస్ట్రీలో దగ్గుబాటి రామానాయుడు అంటే పెద్ద పేరు. ఎందరో దర్శకులను ప్రోత్సహించిన పేరు, ఎక్కువ సంఖ్యలో సినిమాలు నిర్మించిన ఘనతా ఆయనదే. అలాంటి కుటుంబంలోని ఓ వ్యక్తి తనని మోసం చేశాడని శ్రీరెడ్డి ఆరోపించింది. మొదటి నుంచీ ఈ ఆరోపణతోనే ఆమె ఫోకస్‌లోకి వచ్చింది. దగ్గుబాటి అభిరామ్ నన్ను వాడుకున్నాడంటూ ఆమె ఫోటోలు బైటపెట్టడంతో ఎక్కడాలేని సంచలనం తెలుగు చిత్రపరిశ్రమలో కలిగింది. ఐనా దగ్గుబాటి సురేష్ కుటుంబీకులు ఎవరూ ఒక్క ముక్క దాని గురించి మాట్లాడలేదు. జీవిత బైటికి వచ్చి అసలు ఆ ఫోటోల్లో ఏం ఉంది..అంతగా ఎందుకు మా ఇండస్ట్రీ వాళ్లు భయపడుతున్నారు. ఎవరు ఎవరితో తిరగడం లేదు..ఎక్కడ లేదు ఈ తిరుగుళ్లు అన్నట్లు మాట్లాడింది..ఐనా కూడా దగ్గుబాటి రాణా, సురేష్, వెంకటేష్ ఎక్కడా దీని గురించి స్పందించలేదు..
ఐతే ఇప్పుడో విషయం ఆసక్తి కలిగిస్తుంది..త్రిపురనేని చిట్టి అని ఒక సినిమా నిర్మాత ఉన్నాడు..ఈయన పెద్దగా సినిమాలు తీయలేదు. మాటల రచయిత త్రిపురనేని మహారధి కొడుకు ఈయన. 99టివిలో అభిరామ్‌తో శ్రీలేఖ ఉన్న ఫోటోలు బైటపెట్టినప్పుడు ఆమె పక్కన ఉన్నది ఈయనే..ఈయనే స్వయంగా దగ్గుబాటి సురేష్ తో మాట్లాడతా..అని అప్పుడే ప్రకటించాడు. ఐతే ఆ తర్వాత ఏమైందో చాలామందికి తెలీదు..ఐతే దీని గురించే మరో ఛానల్ లో మాట్లాడుతూ..సురేష్ తో తాను మాట్లాడినట్లు చెప్పాడు. సురేష్ ఈ విషయంలో కలగజేసుకోనని..ఇందులో ఎలాంటి చర్యలు , పరిణామాలు చోటుచేసుకున్నా  ఎదుర్కోవడానికి సిధ్దమని చెప్పాడట. పైగా     "  నా కొడుకుకి ఈ సంఘటన ఓ గుణపాఠం నేర్పుతుంది ..He will learn a lession from this "   అని కూడా సురేష్ అన్నాడట..

ఇది నిజమైతే..కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై సురేష్ బాబు కుటుంబం బాగానే ఇబ్బంది పడినట్లు అర్ధం చేసుకోవాలి. దీనికి తోడు దగ్గుబాటి  అభిరామ్, రాణా ఈ ఇద్దరిపై డ్రగ్స్ తీసుకున్నారనే వార్తలు కూడా అప్పట్లో బాగానే విన్పించాయ్. అభిరామ్ వ్యవహారశైలిపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయ్. ప్రతి దానికీ ఆధారాలు చూపలేరు కానీ..ఇతగాడు ఓ రకంగా సెట్ లో ఉన్న ఆడవాళ్ల పాలిట సింహస్వప్నం అని అంటారు..ఇప్పుడు సురేష్ ఈ వైఖరి తీసుకోవడంపై కూడా అదే కారణమనుకోవచ్చు

Comments