అకీరానందన్, రేణుదేశాయ్‌ని ఏడ్పించేసిన మెగా ఫ్యామిలీ


మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా వాళ్ల ఫ్యాన్స్‌లో చెప్పలేనంత ఆసక్తి కలిగిస్తుంది. అలాంటిదే ఒకటి ఆదివారం నుంచి తెగ తిరుగుతోంది. అదే అకీరానందన్
14ఏళ్ల వాడయ్యాడు. తన బర్త్‌డే సందర్భంగా అతని తండ్రి తరపువాళ్లంతా శుభాకాంక్షలు చెప్పారు. నిర్మాత గణేష్ తో మొదలైన ఈ ట్వీట్ల పరంపర వెయ్యి సంఖ్యకి చేరింది. దీంతో పాటే మెగాస్టార్ చిరంజీవి. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ అంతా తమతో అతను దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ విషెస్ చెప్పారు.పవన్ కల్యాణ్, అకీరాతో కలిసి ఉన్న ఫోటోని రామ్ చరణ్ ట్వీట్ చేస్తే..పాత ఫోటోలను వరుణ్ తేజ్ ట్వీట్ చేయడం ఇలా ఎవరికి వారు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
 దీంతో అకీరా కురసోవా నందన్ తల్లి రేణుదేశాయ్ బాగా ఎమోషనల్ అయిపోయిందట. చెప్పలేనంత ఆనందంగా ఉందని..తన బిడ్డపై ఇలానే అభిమానం, ఆశీర్వాదం చూపించాలని కోరుతూ తిరిగి ట్వీట్ చేశారు. తల్లిదండ్రుల వైపు ఎంతో ప్రముఖ వ్యక్తులున్న బ్యాక్ గ్రౌండ్ అకీరాదని..అందుకు అతను ఎంతో అదృష్టవంతుడని చెప్పిందామె..తన లిటిల్ బర్త్ డే బాయ్..ఎప్పటికీ తన దృష్టిలో చిన్నవాడేనని తెలిపారు. పిల్లలు ఎంత  ఎదిగినా తల్లిదండ్రులకు పసివారిలానే కన్పిస్తారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా రేణుదేశాయ్ పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం దానికి ఆమె మండిపడటం వంటి ఎపిసోడ్లు నడిచిన తర్వాత..ఇప్పుడిలా సహృద్భావ వాతావరణంతో కూడిన మెసేజులు పెట్టుకోవడం ఇదే తొలిసారి. ఇది ఇలానే కొనసాగాలని వారు కోరుకుంటున్నారు. ఒకవైపు చిరంజీవి సైరాతో..మరోవైపు రామ్ చరణ్ రంగస్థలం హిట్ తో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు..అకీరా తండ్రి పవన్ కల్యాణ్ కూడా రాజకీయాల్లో చురుకుగా మాట్లాడుతుండటంతో మెగా ఫ్యామిలీ అంతా బిజీబిజీగా ఉన్నారు..ఈ సమయంలో వచ్చిన అకీరానందన్ బర్త్ డే వారందరికీ ఒక ఆటవిడుపులా దొరికిందనుకోవచ్చు. అకీరా బర్త్ డేకి పవన్ వెళ్లిందీ లేనిదీ తెలియకపోయినా..ఆ ఫోటోలు మాత్రం ఇప్పుడు నెట్టింట్లో బాగా హడావుడి చేస్తున్నాయ్

Comments