మేడమ్ టుస్సాడ్స్‌లో మహేష్..ఇదీ ప్రిన్స్ క్రేజ్ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చూడండి



మహేష్ బాబు ఆన్ క్లౌడ్ 9..భరత్ అను నేను సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్‌కి పండగ వాతావరణ కన్పిస్తుంటే..ఇదే సమయంలో ఇంకో హ్యాపీ న్యూస్..అదే మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టబోతున్నారు. ఇందుకోసం అక్కడి ప్రతినిధులు వచ్చి కొలతలు తీసుకుంటున్న ఫోటోలు మహేష్ బాబు ట్వీట్ చేయడంతో విషయం బైటికి వచ్చింది.
ఈ ఫీట్ సాధించిన రెండో తెలుగు వ్యక్తి మహేష్ బాబు అంటున్నారు. తొలి వ్యక్తిగా నటుడు ప్రభాస్ రికార్డులెక్కాడు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమ ఆనందంగా ఫీలవుతుంది. వీళ్లకే ఇలా ఉంటే ఇక మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి ఎలా ఉందో చూడాలి. ఐతే ఇక్కడే కొన్ని వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అనేది లండన్‌లోని ఒక ప్రదర్శన శాల..ఇందులో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తులవి మాత్రమే మైనపు ముద్దలతో చేసిన విగ్రహాలను నెలకొల్పుతారు. అక్కడి వారే కాకుండా వివిధ దేశాలనుంచి వచ్చిన టూరిస్టులు ఈ మ్యూజియంని సందర్శిస్తారు. ఇక్కడ విగ్రహం పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు..లండన్ టుస్సాడ్స్ మ్యూజియం స్వయంగా తనకి సంబంధించిన శాఖల్లాంటివి ఇతర దేశాల్లోనూ ఏర్పాటు చేసింది. చైనాలో బీజింగ్, షాంగై, చాంగ్జి, ివూహాన నగరాల్లో ఇలాంటి బ్రాంచులు ఉన్నాయ్. ఇక టోక్యో, సింగపూర్, బ్యాంకాక్, థాయిలాండ్ లోనూ దీనికి శాఖలున్నాయ్. మన దేశంలోనూ న్యూఢిల్లీలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వహిస్తోంది. ఇది మేడమ్  టుస్సాడ్స్‌కి 24వ శాఖ..అలా ఇప్పుడు మహేష్ బాబు విగ్రహం కూడా తయారవుతోంది..


అంటే ఒకప్పుడు లండన్‌లో ఉన్న మ్యూజియంలో మాత్రమే ఇలా మైనపు విగ్రహాలు పెడుతుండగా, ఇతర దేశాల్లోనూ ఇలా ప్రముఖ వ్యక్తుల ప్రతిమలు ఉంచడం సాధారణమైపోయింది..మహేష్ బాబు విగ్రహం కూడా అలానే చేరుతోంది..ఐతే లండన్‌లో పెడితేనే గొప్ప అని కాదు..ఇక్కడ మేడమ్ టుస్సాడ్స్ బ్రాంచ్‌లో పెట్టినా అది ఘనమైన విషయమే..ఐతే అప్పట్లో ప్రభాస్ మైనపు విగ్రహం పెట్టడం ఏదో గ్రౌండ్ బ్రేకింగ్ ఈవెంట్ అన్నట్లు ప్రచారం చేసుకుంది బాహుబలి టీమ్..ఇది పాపులర్ వ్యక్తులు కేటగరీలో ఎవరివైనా పెట్టడమే తప్ప ప్రపంచస్థాయి రికార్డు మాత్రం కాదు..ఆ విషయాన్ని దాచిపెట్టి బాహుబలి టీమ్ బానే సొమ్ము చేసుకుంది..ఐతే ఇప్పుడు మహేష్ బాబు మాత్రం దానిని దాచి పెట్టకుండా వ్యవహరించడం విశేషం

Comments