డిప్యూటీ సిఎం వెరైటీ కామెంట్


రాజకీయనేతలు మాటలు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉంటాయ్. ఎప్పుడు ఎవరి మనసులొ మాట ఇదే అనుకున్నా..వెంటనే తమ వాక్చాతుర్యంతొ అదికాదు మా బాట అని తేల్చుతుంటారు. ఏపీ డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి వైఖరే చూడండి..ఆయన ఉప ముఖ్యమంత్రే కాకుండా..రెవెన్యూ మంత్రి కూడా..కొన్నాళ్లైనా ఆ శాఖని ఎంజాయ్ చేశారా అంటే లేదు..ఈ లొపే ఆ శాఖ అధికారాలు అన్నీ వేరేవాళ్లు తన్నుకు పొయారు కూడా..

తిరుమల తిరుపతికి వెళ్లిన ప్రతివాళ్లూ మాట్లాడే మాటలే ఆయనా బుధవారం చెప్పాడు..రాష్ట్రప్రజలు ఆనందంగా ఉండాలని కొరుకున్నాడట..అలానే నవ్యాంద్ర రాజధాని అద్భుతంగా ఉండాలని కూడా దేవుడ్ని వేడుకున్నాడట..ఇది నిజమేనా...కాసేపు అనుకుందాం..కానీ ఆ తర్వాతే తాము బిజెపికి వ్యతిరేకం కాదు..మొడీకి మాత్రమే వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడు..ఎందుకయ్యా అంటే ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకట..ఆ మాటకి వస్తే ఆనాడు నిండుసభలొ అరుణ్ జైట్లీ కాదా..ఏపికి హొదా కొసం ప్రశ్నలు సంధించింది..ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి వెలగబెడుతున్న వెంకయ్యకాదా..జైరామ్ రమేష్ ని ధడ్ ధడ్ లాడించింది..బిజెపిలొ ఉన్న పెద్దలంతా అన్యాయం చేస్తే..అక్కడికేదొ మొడీ ఒక్కడు హామీలకు అడ్డం ఉన్నట్లు మాట్లాడటమేంటి మంత్రివర్యా..


Comments