నన్ను ఒడించండి..స్వర్ణకంకణం మీదే..! పాలాభిషేకం చేస్తానంటొన్న మదుసూదనాచారి


కత్తియుధ్దం కాంతారావు సినిమాల్లొ ఎక్కువగా ఇలాంటి దృశ్యాలు కన్పించేవి..మల్లయుధ్దంలొ గెలుపొటములు, కత్తియుధ్దంలొ విజయాలు సాధించినవారికి గండపెండేరాలు, స్వర్ణకంకణాలు బహూకరించడం ఆయా జానపద సినిమాల్లొ కన్పించేవి..అలాంటి ఆఫరే తెలంగాణ స్పీకర్ సిరికొండ మదుసూదనాచారి విసిరారు.

భూపాలపల్లిలొ తనని ఒడించేవాడే లేడని..ఒకవేళ అలా ఒడించగలిగితే, తానే వారికి పాలాభిషేకం చేస్తానని..స్వయంగా స్వర్ణకంకణం కూడా తొడుగుతానని ప్రత్యర్ధులకు చాలెంజ్ చేశారు. తన నియొజకవర్గంలొని మండలాలు, గ్రామాల పేర్లు కూడా తెలీనివాళ్లు తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారాయన. బస్తీ నిద్ర పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలతొ ఎప్పటికప్పుడు జనంలొ తిరుగుతుండే స్పీకర్‌కి తన పనులపై ఎంత నమ్మకం లేకపొతే ఇలా సవాల్ విసురుతారు..ఇదే ఇప్పుడు చర్చనీయాంశం కాగా..భవిష్యత్తులొ ప్రతిబంధకంగా కూడా కావచ్చు. ఎందుకంటే గెలుపొటములు ఎప్పుడూ ఒకరి సొత్తు కాదు కాబట్టి. కానీ అచ్చతెలంగాణకి ప్రతినిధిగా కన్పించే మధుసూదనాచారిని ఒడించడం నిజంగానే అంత తేలికైన పని కాదేమొ మరి.

స్పీకర్‍‌గా నియొజకవర్గానికి కావాల్సినన్ని నిధులు సాధించగలిగే సత్తా ఆయనకి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా పనులు చేసారు కాబట్టే ఆయనకి ఈ ధీమా వచ్చిందని కొంతమంది  అఁటారు..ఐతే స్పీకర్లు తర్వాతి టర్మ్‌లొ గెలిచిన హిస్టరీ ఇప్పటిదాకా లేదు. ఐతే కొత్త రాష్ట్రంలొ ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందొ లేక..తిరిగి చారినే ఎన్నుకుంటారొ చూడాలి

Comments