వైఎస్సార్ ఫ్యాన్స్‌కి హ్యాపీ న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. వచ్చే సంక్రాంతికల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై తీస్తోన్న యాత్ర సినిమా పూర్తి చేయాలని నిర్మాతలు డిసైడైతే..ఇప్పుడు వారికి అనుకోని విధంగా ఓ పెద్ద స్టార్ హీరో సపోర్ట్ లభిస్తోంది. బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్..ఈ సినిమా నిర్మాత విజయ్‌కి అండగా ఉంటానని మాట ఇచ్చాడట. సినిమా దర్శకుడు మహి.వి. రాఘవ ద్వారా కథ తెలుసుకున్న ప్రభాస్..ఈ సినిమా ఎంత ఖర్చైనా పర్లేదు నువ్ చెప్పిన నెరేషన్‌లోనే తీయమని సూచించాడు.

ప్రొడ్యూసర్లైన శశిదేవిరెడ్డి, చిల్లా విజయ్‌లు ప్రభాస్‌కి బాగా పరిచయం. ఆ పరిచయంతోనే ప్రభాస్ వీళ్లిద్దరూ తీస్తోన్న ఈ సినిమాపై ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దర్శకుడిని పిలిపించుకుని కథనంపై ఆరా తీయగా..బాగా ఇంప్రెస్ అయిన ప్రభాస్ ఇందుకోసం బ్యాక్ ఎండ్ సపోర్ట్‌గా నిలుస్తానని మాట ఇచ్చాడట. దీంతో అటు ప్రొడక్షన్ యూనిట్‌తో పాటు ఇక్కడ వైఎస్సార్, వైఎస్ జగన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్లో మళయాళనటుడు మమ్ముట్టి నటిస్తుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా ఆకట్టుకుంది. కేవిపీగా రావు రమేష్ ని సెలక్ట్ చేసినట్లు టాక్..తొందర్లోనే ఇతర నటీనటుల వివరాలు కూడా పూర్తిగా బైటికి వస్తాయ్. ఇంతలోనే బాహుబలి, యాత్రకి అండగా నిలుస్తానని హామీ ఇవ్వడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది

Comments