కటౌట్‌లకు పాలాభిషేకాలు..ఎఁదుకు బాబూ..!



విజయవాడలో చంద్రబాబు, లోకేష్‌కి జాయింట్‌గా పాలాభిషేకాలు చేసారు..ఇది కూడా జనం ఖాతాలో వేస్తారు...నిజానికి ఇది చేసింది టిడిపి లీడర్లు.. టిడిపి యూత్ లీడర్ అవినాష్. తండ్రి చావు తర్వాత దేవినేని అవినాష్ టిడిపి పెదబాబు, చినబాబుకి బాగాానే భజన చేయడం అలవాటైపోయింది. అంతకు ముందు తండ్రీకొడుకులు కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి రావడం బాగా లేట్ అయింది. ఐతే ఇలాంటి కార్యక్రమాలతో ఆ లోటు తీర్చుకునే పనిలో పడ్డాడని కామెంట్లు వస్తున్నాయ్

లేకపోతే ఖచ్చితంగా 2019కి ఇంకా ఐదు నెలలు గడువు ఉఁది..నాలుగున్నరేళ్లు మొద్దు నిద్రపోయి..ఇప్పుడు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగభృతి ఇస్తారట..ఇది చీత్కారాలకు గురి అవుతుందేమో అని ముందే జాగ్రత్తపడి, స్కందావారాలతో పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు అంతే..మినరల్ వాటర్ పంపిణీ కూాడ ఇంతే చేస్తారేమో. ఇంతకన్నా అసలు పథకాలు మేం అనుకున్నది వేరు ఇప్పుడు అవుతుంది వేరు కాబట్టి వాటికి మంగళం పాడాం అని చెప్పినా జనం పట్టించుకోరు. అంతేకానీ ఇలా ఏదో చెప్పాం కదాని
నామకార్ధంగా ప్రారంభిస్తే అభాసు పాలవకతప్పదు.
అసలు నిరుద్యోగభృతి ఇస్తాం అని ప్రకటించమని ఎవరూ అడగలేదు..ప్రకటించారు పో..ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆ కార్యక్రమం ఏదైనా కనీసస్థాయిలో వివరాల సేకరణ అయినా చేస్తే బావుండేది..కానీ అది జరగకుండా ఏదో లోకేష్ బాబు వచ్చి ఊడబొడిచేశాడని చెప్పుకోవడానికి తప్ప..ఈ వెయ్యి రూపాయలు..1500 భృతి ఎవడికి కావాలి
మరీ ఇంత ఘోరంగా ఏపీజనాన్ని మోసం చేయడం తగునా

Comments