ఆ పార్టీ ఈ పార్టీ అంటూ అటూ ఇటూ తిరిగి చివరికి చేరాల్సిన చోటుకే చేరారు లక్ష్మీనారాయణ. నిజానికి ఈ చోటకి ఆయన ముందే రావాల్సింది కానీ ఇప్పటికి ఆయనకి ఎవరితో కలవాలో తెలిసి వచ్చింది. సొంతంగా పార్టీ పెట్టాలని ఊగినా..చివరకు అది ఆర్ధికంగా భారం కావడంతో పాటు ప్రయాసలకు లోను కావాల్సిన వి్షయం. ఓ రాజకీయ పార్టీని పెట్టి..సొంతంగా దాన్ని నడపాలంటే మహామహులకే సాధ్యం కాక..చివరకు తమ విలువలు కోల్పోయిన దాఖలాలు ఎన్నో చూశారు. అఁదుకే జేడీ లక్ష్మీనారాయణ లక్ష్యం జనసేనలో చేరడం ద్వారా ఓ రూపానికి వచ్చినట్లైంది
ఈ చేరిక ద్వారా వర్గాల కలయిక కూడా సమతూకంగానే చెప్పాలి. ఎందుకంటే కాపువర్గ ప్రముఖులందరికీ ఓ గొడుగు అందులోనూ రాజకీయవేదిక అంటే
ఈ మధ్యకాలంలో ఏదీ లేదు..దీనిపై కులముద్ర వేయాలని కాదు కానీ..బిసిలకు రాజ్యాధికారం అనే స్లోగన్ ఎత్తుకోవడానికి ఈ పోలరైజేషన్ బాగా ఉపయోగపడుతుంది.
వాస్తవానికి ప్రజారాజ్యం సమయంలోనే చిరంజీవి చేసిన తప్పు వామపక్షాలతో కలవకపోవడం..ఏ మచ్చాలేని పార్టీగా ఆ పార్టీలతో కలిసి వెళ్తే అదెంతో లాభించి ఉండేది..
అప్పట్లో లోక్ సత్తాని కూడా కలుపుకుంటే అమరిక సరిపోయేది. అందుకే ఇప్పుడు ఆ లక్ష్మీనారాయణ బదులు ఈ లక్ష్మీనారాయణ తమ్ముడు పవన్ కల్యాణ్తో కలవడం చక్కగా అన్పిస్తోంది.
దానికి తోడు వామపక్షాలు..బిఎస్పీ కలయికతో ఆంధ్రప్రదేశ్లో రియల్ మహాకూటమి అంటే ఇదే అన్పించకమానదు..ఇక కదనరంగంలో ఏమేరకు ఇది సక్సెస్ అవుతుందో మాత్రం చూడాలి
Comments
Post a Comment