నన్ను ఓడించడానికి వెయ్యికోట్లు ..చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో


తెలంగాణలో గెలిచిన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేత ఒకరు ఇవాళ ఓ ఛానల్‌లో మాట్లాడుతూ..మాకు ఏపీతో సంబంధం లేదు..ఇక్కడ మేం పాజిటివ్ ఓట్ కోరాం..ఇదిగో ఈ పని చేశాం..మళ్లీ అధికారం ఇస్తే ఇంకా బాగా చేస్తాం అని చెప్పి ఎన్నికలలో ఓట్లడిగాం..కానీ దరిద్రం ఏమిటంటే..చెప్పడానికి ఏమీ లేక..కేసీఆర్ గారి మీద..మామీద పడి ఏడవడం చంద్రబాబునాయుుడుగారికి అలవాటైపోయింది..ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జనాలకి తాము ఏం చేయలేదు కాబట్టే..ఫలానాది చేశాం అని చెప్పుకోవడం లేదు..అని కామెంట్ చేసారు

దానికి తగ్గట్లుగానే ఉంది చంద్రబాబుగారి ప్రచారం..కేసీఆర్ విద్యుత్ ఇవ్వాలి..మోడీ స్విచ్ వేయాలి..అప్పుడే జగన్ ఫ్యాన్ తిరుగుతుంది ..పీకే కేసీఆర్ జగన్  సైబర్ క్రిమినల్స్.. అరాచకశక్తులు..వాళ్లు అధికారంలోకి వస్తే రౌడీరాజ్యం వస్తుంది.మోసాలు చేసినందుకు జగన్ పై 31 కేసులు ఉన్నాయ్..ఇలా సాగిపోతూ ఉంది ఆయన ప్రసంగం..వెళ్లిన ప్రతి చోటా ఆయనంతట ఆయనే వివేకానందరెడ్డి హత్య గురించి ప్రస్తావిస్తారు..జగన్మోహన్ రెడ్డే ఆయన బాబాయిని చంపించారంటూ ఓపెన్‌గా తీర్పులిచ్చేస్తారు..ఇలాంటివి చూసినప్పుడు పైన చెప్పిన ముఖ్యనేత అన్న మాటల్లో వాస్తవం తప్ప సత్యదూరమైన ఆరోపణలు లేవనిపించకమానదు

పనిలోపనిగా ఏపీలో టిడిపిని ఓడించేందుకు కేసీఆర్ జగన్ కి వెయ్యికోట్లు ఇచ్చారని కూడా చంద్రబాబు చెప్తారు..వాస్తవానికి కేసీఆర్‌కి చంద్రబాబుని ఓడించాల్సిన అవసరం ఏంటి..తెలంగాణలో ఎటూ టిడిపిని భూస్థాపితం(ప్రస్తుతానికి) చేశారు..ఇక ఏపీలో ఏ పార్టీ ఉంటే ఆయనకి ఏంటి నష్టం..లాభం..పైగా ఎటూ జగన్ ప్రతిపక్షనేత..ఆయన గెలవడానికి ఆయనే తపనపడతాడు..కానీ మధ్యలో ఈ నేత్రానందంలాగా కేసీఆర్ వెయ్యికోట్లు జగన్‌కి ఇవ్వడమేంటని..ఆధారాలు  లేకుండా అడ్డంగా మాట్లాడుతూ పోతే..ముఖ్యమంత్రులకు కూడా చట్టాలు వర్తించవా..ఇలా తాము చేసింది చెప్పుకునేది తక్కువనూ...ఎదుటివాళ్లపై పడి ఏడవడమే ఎక్కువగా కన్పిస్తోంది

Comments

  1. సరిగ్గా ఇటువంటి ఆరోపణలు గత అసెంబ్లీ ఎన్నికలలో పక్క రాష్ట్రం లో ఉన్న ఒక పార్తీ టిడిపి మీద చేసింది.

    ReplyDelete
  2. అదే నోటితో జగన్ లక్షలాది కోట్లు ప్రజాధనం దోచుకున్నాడని అంటున్నారు. ఇదే నిజమయితే ఆఫ్టరాల్ కెసిఆర్ ఇచ్చే బోడి వెయ్యి కోట్ల కోసం కక్కుర్తి పడడన్న ఇంగితం లేదు పచ్చ బాచీకి.

    చంద్రబాబు మళ్ళీ గెలిస్తే గుజరాత్, బీహార్ & తెలంగాణా రాష్ట్రాల నుండి పరిశ్రమలు భ్రమరావతికి తరలి పోతాయి కనుక మోడీ, ప్రశాంత్ కిషోర్ & కెసిఆర్ అందరూ కలిసి కుట్ర పన్నారట. ఆ కుట్రలలో భాగంగానే రాంగోపాల్ వర్మ సినిమాలు తీస్తుంటే స్వరూపానందేంద్ర సరస్వతి యాగాలు చేస్తున్నాట్ట.

    చినబాబు కోరిక మన్నించి ఎల్లా జనం ఏప్రిల్ 9 తారీకున ఓటు వేసి జెండా ఎత్తేసి మరీ పరవశించాలి!

    ReplyDelete
    Replies
    1. పదే పదే మా రాజధానిని మీరు అగౌరవపరచడం మర్యాద కాదు.

      Delete
    2. @Bonagiri Rao:

      సదరు "ప్రతిపాదిత రాజధాని" భ్రమరావతి అంటూ నామకరణం చేసింది IYR కృష్ణా రావు & ఉండవల్లి అరుణ్ కుమార్ గార్లు. కొంపతీసి వారిద్దరూ "మీ" వాళ్ళు కాదంటారా?

      Delete
  3. @ gottimukkala,

    ఏపీ నుంచి వెయ్యి కోట్ల ఫండ్స్ కూడా హైదరాబాద్‌కు తరలించాడని న్యూస్‌పేపర్లు, టీవీ ఛానెల్స్‌తోపాటు, సోషల్ మీడియా అంతా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి
    http://nagnachitram.blogspot.com/2019/03/blog-post_26.html?m=1

    What do you say ?

    ReplyDelete

Post a Comment