కేసీఆర్ టార్గెట్ ఎవరు..?ఈటలేనా..



ఒక్క మున్సిపాలిటీ ఓడినా...మంత్రి పదవులు ఊడతాయ్..ఈ వార్నింగ్ ముందుగానే కొందరిని దృష్టిలో పెట్టుకుని చేసిందని ఇప్పటికే బోలెడంత టాక్ నడుస్తోంది..పైగా నేనే కాండిడేట్ ని సెలక్ట్ చేస్తా..తర్వాత ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదనడం కూడా అందుకు సంకేతమనేనని అంటున్నారు..

ఇప్పటికే ఇద్దరు ముగ్గురు మంత్రులు ఓపెన్ గానే కామెంట్లు చేసారు...ఇద్దరూ గౌడ్ కులస్తులే..ఈ వర్గానికి రాష్ట్రంలో బలమైన పట్టు ఉన్నా...సిఎం ఎందుకో ఈ ఇద్దరిపైనా బాగా గుర్రుగా ఉన్నారని టాక్ అయితే నడుస్తుంది..దీనికి తోడు
రాజేందర్ ఈ మధ్యన చేసిన కామెంట్లు చూస్తే..ఇదేదో చివరికి ఆయన పదవికే ఎసరు తెస్తుందనే టాక్ ఉంది..ఐనా
తానెక్కడా తగ్గేది లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడాయన..పదవులు శాశ్వతం కాదు..తనకి తెలంగాణ ప్రజలు వెనుక ఉన్నారు..వారితోనే పదవి వచ్చిందంటున్న ఈటల..రేపు మునిసిపాలిటీలు ఖచ్చితంగా గెలిపిస్తారనడంలో డౌట్ పడొద్దని ఆయన వర్గం ధీమాగా ఉంది..ఐనా ఇలాంటి వార్నింగులు..పార్టీలో చురుకు పుట్టేందుకే కానీ...ఎవరినీ
టార్గెట్ చేయడం కాదని..కేసీఆర్ కేడర్ చెప్తోంది..
వాస్తవానికి బిజెపితో టిఆర్ఎస్‌లోని 30మంది టచ్ లో ఉన్నట్లు పెద్ద ప్రచారం జరిగింది..అందులో పెద్ద తలకాయల పేర్లు కూడా విన్పించాయ్..అప్పట్నుంచే ఈ లుకలుకలు వచ్చాయంటున్నారు...లేకపోతే..ఏడు ఎంపి స్థానాలు పోయినప్పుడు లేని వార్నింగులు ఇప్పుడెందుకని లాజిక్ తీస్తున్నారు కూడా..నిజమే మరి

Comments