మహేష్ బాబు ఫాలోయింగ్కి తిరుగులేదు..ఇందులో కొత్తేం లేదు..కానీ తన ఫ్యాన్స్ కోసం ఇంకా ఇంకా మారుతున్నాడు..ఇదివరకటిలా రిజర్వ్డ్గా ఉండటం లేదు..మారేందుకు ప్రయత్నమే కాదు..ఆ మార్పు క్లియర్ గా కన్పించే జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు..సెట్స్ పై పిచ్చ పిచ్చగా గొడవ చేస్తాడని అందరూ చెప్పడమే కానీ
ఆ గొడవ ఎలా ఉంటుందో..ఫ్యాన్స్ కి ఇప్పుడు సరి లేరు నీకెవ్వరూ మూవీ ప్రమోషన్లలో కన్పిస్తోంది
వరంగల్ లో మాట్లాడిన మహేష్..గత ఐదేళ్లలో అతను దేని కోసం ట్రై చేస్తున్నాడో అది బైటపెట్టింది..తన సినిమాల్లోని డైలాగులు స్టేజ్ పై ఈజ్ తో వల్లించడం..సందర్భోచితంగా మాట్లాడటం..ఇవి చూస్తుంటే సూపర్ స్టార్ మహేష్ ఇక సినిమాలలోనే కాదు..బయట కూడా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించబోతున్నట్లు తెలుస్తోంది..
ఇంతకు ముందు మహేష్ బాబు ఏ ప్రమోషన్ చూసినా..."కథ వినగానే అమేజింగ్ అన్పించింది. " ఈ సినిమా నా కెరీర్ బెస్ట్.."
ఫైట్లు సూపర్ గా చేసారు
" డైరక్టర్ గారు బాగా తీశారు.."
ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం.."
నాన్నగారి అభిమానులు సూపర్..వాళ్లకి నచ్చకపోతే వాళ్లే చూడరు"
ఇలాంటి రొటీన్ డైలాగులతో నింపేసేవాడు..పైగా ఏదో చెప్పాలని కాబట్టి చెప్తున్నాడేమో అన్పించేది కూడా..కానీ ఇప్పుడు మాత్రం వేరు..శ్రీమంతుడి దగ్గర్నుంచి ప్రారంభమైన ఈ మార్పు..సరి లేరు నీకెవ్వరూతో పూర్తిగా మారిపోయింది.
ఇదివరలో కృష్ణ ఎలాగైతే..మనసుతో మాట్లాడేవాడో..ఇప్పుడు మహేష్ కూడా అలానే తానేం మాట్లాడుతుందీ తెలిసి..ఏ ప్రిపరేషన్ లేకుండానే..జనరల్ గా మాట్లాడుతున్నాడు..ఇది ఫ్యాన్స్ కి సంబరం కలిగించే విషయం
Comments
Post a Comment