పాపం తేనెటీగలకేం తెలుసు ఆయన మెగాస్టారని..ఇంకొకరు రామ్‌చరణ్ మగధీర అని


కోడలు ఉపాసనకి  తాత అయ్యే కామినేని ఉమాపతిరావ్ అంత్యక్రియలకు వెళ్లడంతో..మెగాస్టార్ ఫ్యామిలీపై తేనెటీగలు అటాక్ చేసాయ్..ఇదీ ఫ్లాష్ న్యూస్..కామారెడ్డిలో దోమకొండ  ఫామ్ హౌస్‌లో దొరగారి చివరి వీడ్కోలు ఏర్పాటు చేసారు..ఐతే మరి ఆ పొగకే లేచాయో..లేదంటే ఎవరైనా తుంటరులు పుల్లలతో గెలికారో కానీ..తేనెటీగలు దండు ఇరిటేట్ అయి జనం మీదకు దాడికి బయలు దేరాయ్..వాటికి ఎవరైనా  ఒకటే కదా..మన మెగాస్టార్..చిరు..రాంచరణ్. ఉపాసనపైకి దూసుకువచ్చాయట..

ప్రస్తుతానికి తేనెటీగలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాని..అదే ఏదో భారీగా మిడతల్లాగా వెంటపడితే మాత్రం చాలా కష్టం..( ఓసారి రచయిత వెంటబడ్డాయ్..అది బాగా అనుభవం) కొంతమంది ప్రాణాలు కూడా పోయాయ్ త ేనెటీగల దాడిలో...అసలే ఎండవేడి..తేనెటీగలు కుట్టాయంటే ముందు ఆ ముళ్లు పోయేవరకూ ఆ బాధ 24 గంటలు వెంటాడుతుంది..కాస్త జాగ్రత్తగానే ఉండాలి మెగాస్టార్ ఫ్యామిలీ ఎందుకంటే ఏ జ్వరమో వచ్చిందనుకోండి..ఈ కరోనా సీజన్ లో మరీ ఇబ్బంది మరి..


Comments

  1. ఏ సీజన్ అయినా మీరో నేనో అయితే జ్వరం వస్తే భయపడాలి. మెగా ఫ్యామిలీకి ఆ భయం లేదు. వాళ్ళకి హాస్పిటలే ఉంది!

    ReplyDelete

Post a Comment