వైఎస్సార్సీపీ లీడర్లకి వేరే పనే లేదా..ఆ నిమ్మగడ్డపై పడటం తప్ప


మంచికో చెడుకో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కి ఏపీ ప్రభుత్వపెద్దలకు చెడింది..ఆయన వాదన వెర్షన్ ప్రకారం ఆయన చేసింది కరెక్ట్..కాదు అలా చేయకూడదని ఏపీ ప్రభుత్వంలోని వైెస్సార్సీపీ లీడర్ల వాదన..కానీ ఇలా ఎంతకాలం సాగదీస్తూ పోతారు..అక్కడికి కోర్టులు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమారే ఎలక్షన్ కమిషనర్..అని దాదాపుగా తేల్చేశాయ్..(దాదాపుగా అంటే సుప్రీంకోర్టు కూడా చివరి తీర్పు ఇచ్చేస్తే అని) అలాంటప్పుడు ఇంకా ఆయన్ని పదే పదే టార్గెట్ చేసి ప్రయోజనం ఏంటి

గట్టు శ్రీకాంత్ రెడ్డి అంటాడూ..ఆయనకి నిమిషానికి లక్షల ఫీజు తీసుకునే లాయర్లు ఎలా వచ్చారు..దాని వెనుక ఎవరున్నారు..అంటూ నిలదీయబోతాడు..ఏమైనా అర్ధం ఉందా శ్రీకాంత్ రెడ్డిగారూ..అడ్డగోలుగా ఇలా మాట్లాడితే మీ పరువు కాదు..పార్టీ ప్రతినిధిగా పార్టీ పరువునే తీస్తున్నారు మీరు..అంటే మీరు తప్పితే ఇంకెవరూ లక్షలు పెట్టి లాయర్లని పెట్టుకోలేరనా..అసలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలని వదిలేసి నిమ్మగడ్డనే పట్టుకుని పీక్కుంటే ఏంటి అర్ధం

ఓ ఏడాదికాలం తర్వాతైనా నిమ్మగడ్డ ఇంటికి పోతాడు..రిటైర్ అయ్యే వయసు వస్తే పూర్తిగా ఇంటికే పోవచ్చు..అలాంటిది..ఇదేదో ప్రపంచ సమస్య అయినట్లు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు..జగన్ గారూ మీరైనా చెప్పొచ్చు కదా..మీ బడుద్దాయిలకు..ఓ వైపు కరోనా కేసులు ప్రపంచంలోనే టాప్ దిశగా దేశం..ఆ తర్వాత దేశంలో ఏపీనే టాప్ నంబర్లు చూపెట్టబోతుంటే ఆ సంగతి ఏడవక ఎందుకిదంతా

Comments