ప్రత్యేక తెలంగాణ అయిపోయింది..ఇక సీమనా..?

విడివిడిగా ఉంటేనే మా రాష్ట్రం డెవలప్ అవుతుంది అని సాధించుకున్న తెలంగాణ సెపరేట్ అయిపోయి నాలుగేళ్లు దాటింది..ఈ విభజనే అన్యాయంగా జరిగింది అని చంద్రబాబు ఏ సభలో అయినా ప్రతి సారీ వాపోతుంటారు. అలాంటిది ఇప్పుడు ఆయనకి, ప్రతిపక్షనేత జగన్‌కి చెక్ పెట్టడానికి బిజెపి ప్రత్యేక రాయలసీమవాదాన్ని ప్రోత్సహించేందుకు వ్యూహం రచిస్తున్నారట
ఈ ఇద్దరు నేతలూ ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకి చెందినవారే కావడంతో వీళ్లని బలహీనపరచాలంటే ప్రత్యేకసీమ వాదాన్ని గనుకు ముందుకు తెస్తే వీళ్ల పని ఐపోతుందని బిజెపి ప్లాన్‌గా చెప్తున్నారు. ఈ మేరకు ఓ ఆంగ్లదినపత్రికలో వచ్చిన కథనం ఆశ్చర్యం కలిగించకమానదు. ఎందుకంటే అతడు సిినిమాలో ప్రకాష్ రాజ్  "శివారెడ్డి చనిపోతే మీరు సిఎం అవుతారు కానీ..శివారెడ్డిని మర్డర్ చేస్తే హంతకులు అవుతారు కదా.." అన్నట్లుగా బిజెపి నేతలు
తమంతట తాము బలపడాలి కానీ ఎదుటివాళ్లని బలహీనపరచాలని చూస్తే అవ్వరు కదా
వచ్చే ఎన్నికలలొో బిజెపికి ఎన్ని సీట్లలొ పొటీ చేసే అవకాశం ఉఁదొ ఇప్పుడే చెప్పలేం. ఐనా అక్కడికేదో ఏపీలో తామేదో ఊడబొడిచినట్లు మాత్రమే కుదరదు కదా..

Comments