లోకేశ్కి పెద్ద సవాలే విసిరాడు పవన్ కల్యాణ్. ఇఛ్చాపురం నుంచి అనంతపురం వరకూ ఏ సమస్యపైనైనా..ఎక్కడైనా చర్చించేందుకు మేం సిధ్దమని..దానికి లోకేష్ వస్తారా అంటూ ఛాలెంజ్ చేయడంతో పాపం ఇప్పటిదాకా లోకేశ్ కి ఈ మాత్రం కూడా గుర్తింపు ఇవ్వని నేతలంతా ఉలిక్కిపడ్డారు. జగన్ ని లోకేష్ తిట్టడం దాన్ని జగన్ లైట్ తీసుకోవడం మాత్రమే చూశారు కానీ..పవన్ కల్యాణ్ మాత్రం పదే పదే లోేకేష్ అవినీతి చేశాడు..లోకేష్ చేసిన పనులు చూస్తే
తాత ఎన్టీఆర్ మళ్లీ చనిపోతారు అంటూ రకరకాలుగా చీకాకు పెడుతూనే ఉన్నాడు
ఐతే లోకేష్ మాత్రం తనపై పసలేని ఆరోపణలు చేయొద్దండి..దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలండీ అంటూ సవాళ్లు విసురుతూ దొరకకుండా కవర్ చేస్కుంటున్నారు..ఐతే నిన్నా మొన్నా ఈ ధోరణి మరీ శృతిమించింది. దీంతో పవన్ కల్యాణ్ కి ఆయన ఘాటుగానే సమాధానం ఇచ్చాడు..ఇప్పుడు పవన్ కల్యాణ్ హఠాత్తుగా సమస్యలపై చర్చిద్దాం..అంటూ సవాలు విసరడం కలకలం రేపుతుంది. ఎందుకంటే వస్తానంటే అదో తంటా..రాను అంటే పారిపోయినట్లే..అసలు కామ్ గా ఉన్నా..ఇంకా వెంటపడి కామెంట్లు చేస్తారు.
పైగా పవన్ కల్యాణ్ డైరక్ట్ గా చేతనైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవండి అంటూ సవాల్ విసరడం బాగా ఇబ్బందికరమైన పరిస్థితే..మరోవైపు ఈనాడు జ్యోతి పెద్ద పెద్ద జాకీలేసి మరీ లోకేశ్ ని లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి..పోటీ కోస్తా నుంచా..సీమ నుంచా అని ఒకరు..బరిలో దిగితే గెలుపు ఖాయం అని ఇంకొకరు రాతలు ప్రారంభించాయ్. మరి ఇలాంటి టైమ్లో పవన్ కల్యాణ్ విసిరిన డిస్కషన్ బాంబు పేలుతుందో..తుస్సుమంటుందో చూడాలి
Comments
Post a Comment