ఒకప్పుడు కళ్లు తిప్పుకోనివ్వని అందం..ఇప్పుడెలా ఉందో చూడండి


తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారి నచ్చారంటే చాలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. వారు తిరిగి కన్పించకపోతే ఎన్నాళ్లైనా మర్చిపోరు. ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారా అని ఆలోచిస్తూనే ఉంటారు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో వారికి సంబంధించిన వీడియోలకు లభించే హిట్సే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భామ కూడా అంతే. తెలుగువారికి సురభి పేరుతో పరిచయమైన ఈ అందమైన అమ్మడు హఠాత్తుగా మాయమైపోయింది. ఖచ్చితంగా పాతికేళ్ల క్రితం తెలుగు తెరపై మెరిసిన సురభి మొదటి్ సినిమా చెంకోల్ అనే మలయాళ మూవీ..ఇది కిరీటం అనే సినిమాకి సీక్వెల్.

ఆ తర్వాత సురభి తెలుగులో అల్లరోడు, బంగారు మొగుడు, పల్నాటి పౌరుషం, కేటు డూప్లికేటు సహా పది సినిమాల్లో మాత్రమే నటించింది. వాటిలో మనీ  మనీ కూడా ఉంది. ఇది కూడా ఓ సీక్వెల్ సిినిమా కావడం విశేషం. ఐతే తెలుగులో మనీ మనీనే ముందు విడుదల కావాల్సి ఉన్నా..లేట్ కావడంతో మిగిలిన సినిమాలు విడుదల అయ్యాయ్. ఇలా రెండు భాషల్లో కూడా సీక్వెల్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన అరుదైన అంశం సురభికే సొంతం. అటు కన్నడంలోనూ రాఘవేంద్రరాజ్ కుమార్, విష్ణువర్ధన్‌తో నటించిన సురభి రెండంటే రెండేళ్లు మాత్రమే సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హఠాత్తుగా మాయమైపోయింది.




అప్పటికి ఆమె వయస్సు కూడా చాలా తక్కువ. విషయం ఏమిటంటే తెలుగు.తమిళంలో సినిమాలు ఆపేయడానికి కారణం. ఆమె ధర్మేష్ వ్యాస్ అనే గుజరాతీ దర్శకుడిని పెళ్లాడింది. ఇతనితో అనేక టెలివిజన్ షోలతో పాటు గుజరాతీ స్టేజ్ షోలు చేసింది. అది కూడా పెళ్లైన 15 ఏళ్లకి. అప్పటికే ఆమె బాగా షేపౌట్ అయిపోయింది. ఆమె చేసిన టివి సీరియల్స్ కూడా చాలా వరకూ మనవాళ్లు కూడా చూసి ఉంటారు. కలర్స్, లైఫ్ ఓకే, జీ టివి వంటి ఛానల్స్‌లో ప్రసారమైన ఆమె సీరియల్స్ చూసినా కూడా ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయిందామె. ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో చూసిన రూపలావణ్యం ఇప్పుడామెలో మచ్చుకైనా కన్పించదు. సీరియల్స్‌లో మధ్యవయసు పాత్రలు, అత్తపాత్రలు చేయడానికి అలవాటు పడిపోయింది. 2015 వరకూ టివి సీరియల్స్‌లో కన్పించినా..ప్రస్తుతం తల్లి కావడంతో అవి కూడా మానేసిందని తెలుస్తోంది








Comments