జగన్ ఫిట్ నెస్ సీక్రెట్ సాక్షి బైటపెట్టేసింది


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికి 3వేల కిలోమీటర్లు దాటి ఇంకా అదే ఉత్సాహంతో పాదయాత్ర చేస్తూనే ఉన్నారు(రాసే సమయానికి). ఈ పాదయాత్ర మాత్రమే కాదు అంతకు ముందు ఓదార్పు యాత్ర కానీ, నిరాహారదీక్షలు కానీ జగన్ మార్క్ కన్పిస్తుంది వాటిపై. అంటే ఎంత నీరసించినా..మొహంలో అలసటే తప్ప..కదలికల్లో కన్పించవు. ఇంత ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటయ్యా అంటే సాక్షి పత్రిక బైటపెట్టేసింది
దాని ప్రకారం ఉదయం నాలుగున్నరకే నిద్ర లేచి గంట ఎక్సర్ సైజ్ చేస్తాడట. ఆరున్నర నుంచి ఏడు గంటలవరకూ పేపర్లు తిరగేస్తాడట. ఏడున్నర లోపే ఫోన్లు..పార్టీ లీడర్లని కలవడం పూర్తి చేసిన జగన్ తర్వాత పాదయాత్ర షెడ్యూల్ చూసుకుని బైల్దేరడం ప్రారంభిస్తారు. షెడ్యూల్ లో ఎక్కడా తేడా రాకుండా చూసుకోవడం జగన్ స్పెషాల్టీగా చెప్తారు. మధ్యలో ఎక్కడైనా ఎక్కువసేపు ఆగితే..దాన్ని మిగిలినచోట ఫాస్ట్ గా నడవడంతో కవర్ చేయొచ్చు. మరింత పర్ఫెక్ట్ గా చేయాలంటే..ఫుడ్ ఏం తీసుకుంటారు అంటే
ఓ గ్లాస్ జ్యూస్ మాత్రమేనట. మధ్యాహ్నం లంచ్ కొన్ని పళ్లు..కప్పు పెరుగు..ఇది నిజంగా విచిత్రంగా అన్పిస్తుంది..ఎందుకంటే 40 దాటితే పెరుగు మానేయమంటారు..బహశా ఎండలో నడుస్తున్నాడు కాబట్టి వంటి చలవ కోసం ఇలా చేస్తుండొచ్చు. ఇక రాత్రి భోజనం మాత్రం రెండు పుల్కాలు..పప్పు..కూర..ఇంతే సింపుల్.  మరి అంత పెద్ద శరీరానికి ఇంతేనా ఫుడ్..అంటే ఏదైనా మన శరీరానికి అలవాటు చేసే తత్వాన్ని బట్టే ఆకలి ఉంటుందట..తినడానికి బతకడం కాదు..బతకడం కోసమే తినాలి..ఇలా చేస్తారు కాబట్టే..చాలామంది సెలబ్రెటీలు..రాజకీయనాయకులు..ఏ వయసులోనైనా ఉత్సాహంగా కన్పిస్తుంటారు సో మీరూ ట్రై చేయండి

Comments