నీ మొగుడు కాబట్టే వదిలేశావా..సమంతకి మహేష్ ఫ్యాన్స్ షాక్


సూపర్ స్టార్ మహేష్‌బాబుకి ఆ  బిరుదులాగా ఫ్యాన్స్ కూడా వారసత్వంగా వచ్చారు. వీరాభిమానులంటే వాళ్లే అన్పించుకుంటుంటారు. సమంతపై ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కోపం ఎందుకంటే ఓ నాలుగేళ్లు వెనక్కి వెళ్లాలి. వన్ నేనొక్కడినే అనే మేధావివర్గ సినిమా ఒకటి సుకుమార్ డైరక్షన్‌లో వచ్చింది. అందులో ఓ  పాటలో కృతిసనన్..మహేష్ బాబు నడిచివెళ్తుంటే పడ్డ అడుగుల ముద్రల వెనుక మోకాళ్లపై కూర్చుని ఫాలో అవుతుంటుంది. ఇది ఓ పోస్టర్‌ లా వేశారు. దీనిపై మరీ అమ్మాయిలంతే అంత చులకనా అంటూ ట్విట్టర్లో మహిళాభిమానంతో పురుషాధిక్యతపై స్పందించింది. ఐతే మహేష్ బాబు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదైనా ఉఁటే తనతో కానీ డైరక్టర్ తో కానీ చెప్పాలి కానీ ఇలా ట్విట్టర్లో పోస్ట్ చేయడమేంటి..ఇది ఆమె అమాయకత్వానికి నిదర్శనం. ఎందుకంటే సోషల్ మీడియా ఎంత పదునైన కత్తో సమంతకి తెలీడం లేదు అని అప్పట్లోనే చెప్పాడు.  ఐతే ఫ్యాన్స్ మాత్రం ఊరుకోలేదు. శామ్ పై తమ కోపాన్ని అప్పటికప్పుడే వెళ్లగక్కారు కూడా.

ఐతే ఇప్పుడు వాళ్లకి మంచి చాన్స్ దొరికింది. శైలజారెడ్డి అల్లుడు సినిమాలో నాగచైతన్య కాళ్లపై అనూ ఇమ్మానియేల్ ముద్దు పెడుతుంది. దీంతో ఈ సీన్ ని పట్టేసుకుని ఏమ్మా...సమంతా ఇప్పుడీ సీన్ నీ కళ్లక కన్పించడం లేదా అప్పట్లో పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా..ఇప్పుడేమంటావు అంటూ విమర్శలవాన కురిపించేస్తున్నారు. దీంతో అప్పట్లో మహేష్ బాబు చెప్పిన మాట నిజమైనట్లుంది. సోషల్ మీడియా ఎలాంటి ప్లాట్ ఫామో తెలీకుండా చిన్నపిల్లలా పోస్ట్ చేసింది అని ప్రిన్స్ చెప్పినట్లుగానే ఇప్పుడు ట్రోల్ కి గురవుతోంది పాపం సమంత. దీనికి ఆమె ఎలా స్పందిస్తుందో కానీ కొంతమంది మాత్రం మహేష్ బాబు ప్యాన్స్ తో పెట్టుకుంటే అంతే మరి అంటున్నారు

Comments