ఇద్దరితో రిలేషన్ అన్నారు కానీ ఇప్పుడెంత హ్యాపీగా కాపురం చేస్కుంటుందో చూడండి

ఈ హీరోయిన్‌ని చూస్తే అందమంటే ఇలా ఉండాలి అన్పిస్తుంది. ఒక్క మచ్చా లేకుండా చక్కగా పెద్ద కళ్లతో చూడగానే ఆకట్టుకునేలా ఉండే నిఖిత తెలుగు సినిమాలకు దూరమై చాన్నాళ్లు అయింది. కెరీర్‌లో ఇప్పటిదాకా 50 సినిమాలు చేసినా నిఖితకి ఓ కమర్షియల్ హీరోయిన్ కి రావాల్సిన హిట్ మాత్రం లేదు. తెలుగులో అయితే కల్యాణరాముడు, ఖుషీఖుషీగా సినిమాలే మంచి విజయాలు సాధించిన చిత్రాలుగా చెప్పుకోవాలి. కన్నడంలో మాత్రం ఎక్కువ విజయాలు సాధించాయి. పంజాబీ కుటుంబానికి చెందిన నిఖిత తుక్రల్ జీటీవీలో వచ్చే ఓ సీరియల్ లో మొదట్లో నటించింది. 2002లో ముంబైలోని జుహు ఏరియాలోని ఓ రెస్టారెంట్లో తెలుగు నిర్మాత రామానాయుడి కంట్లో పడింది. వెంటనే తన బ్యానర్‌లో ఇవివి కొడుకు రాజేష్ హీరోగా తీస్తోన్న హాయ్ లో ఆమెని బుక్ చేశారు.

తర్వాత సంబరం, కల్యాణరాముడులో ఆపర్లు వచ్చాయామెకు. చక్కని కుటుంబచిత్రాలకు తగిన క్యారెక్టర్లు వచ్చేవి నిఖితకు తెలుగులో..ఐతే కన్నడంలో మాత్రం మంచి మాస్ క్యారెక్టర్లు చేసింది. ఈ దశలోనే ఆమెని ఓ తెలుగు దర్శకుడు లవ్ చేశాడని పుకార్లు వచ్చాయి. ఆమెతోనే పెళ్లి కూడా ఉంటుందని సదరు దర్శకుడు చెప్పుకునేవాడు. కానీ ఆమె మాత్రం కన్నడంలో బిజీ అయిపోయింది. దానికి తోడు అక్కడ హీరో దర్శన్ తో క్లోజ్‌గా ఉంటూ అతని కాపురంలో నిప్పులు పోసిందని విమర్శలు ఎదుర్కొన్నది. దర్శన్ భార్య ఆత్మహత్యాయత్నం వరకూ విషయం వెళ్లగా నిఖితపై కన్నడనాట బ్యాన్ పెట్టారు.


ఐతే నటీనటులు నిఖితకు మద్దతుగా నిలవడంతో ఆ నిషేధాన్ని ఐదే రోజుల్లో తొలగించారు. ఈ దశలోనే ఆమె తెలుగు, కన్నడానికి దూరమైంది. సినిమాలు తగ్గిపోయాయ్. ఒకటి రెండు పాత్రలే చేయసాగింది. అప్పుడే ముంబైలోని గగన్ దీప్ సింగ్ అనే వ్యాపారస్తుడితో ప్రేమలో పడిందట. ఆమె కజిన్‌కి సంబంధించిన ఓ శుభకార్యంలో 2015లో కలవగా...ఆ పరిచయం పెళ్లికి దారి తీసింది. ఇప్పుడు వారికి ఓ పాప కూడా ఉంది. ఇప్పటికీ ముంబై ఫ్యాషన్ వీక్స్‌లో పార్టిసిపేట్ చేస్తుంటుంది నిఖిత. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. అందుకు సంబంధించిన విశేషాలను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తుంటుంది కూడా. రీసెంట్ గా తన జీవితం ఎంతో హ్యాపీగా ఉందంటూ పోస్ట్ చేసిన ఓ ఫోటో కూడా మీరు చూడొచ్చు.



Comments