రైలు బాత్ రూమ్‌లో పాపాయి..ఎఁత కర్కశులో కదా


మాతృత్వం మధురం అంటారు..అలానే కడుపుతీపి ఎంతకైనా తెగిస్తుందని చెప్తుంటారు..కానీ కొన్ని సంఘటనలు చూసినప్పుడు మాత్రం వాటికి అర్ధం తెలీనివాళ్లు కూడా ఉన్నారనిపిస్తుంది..ఐతే నిజంగా కావాలని వదిలేశారో..అలా
పరిస్థితులు ప్రేరేపించాయో కానీ..హౌరా మెయిల్‌లో దారుణం  చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పాపాయిని టాయిలెట్లలో పడి ఉండటం తటస్థించింది.

పంజాబ్ నుంచి హౌరా ఎక్స్ ప్రెస్ వెళ్తుండగా..ప్రతిసారీ అమృత్‌సర్ స్టేషన్లో రైలుని శుభ్రం చేసేందుకు కాసేపు ఆపుతారు. ఈ సమయంలో బాత్‌రూములు క్లీన్ చేస్తోన్న స్వీపర్లకి టాయిలెట్ సీటులో చిక్కుకుని ఏడుస్తోన్న నవజాత
శిశువు కన్పించింది. స్థానిక ఆస్పత్రి సిబ్బందికి స్వీపర్లు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే శిశువుకు
చికిత్స అందించారు. ప్రస్తుతం పాపాయి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అమృత్‌సర్ పోలీసులు 
ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం వింటుంటేనే వళ్లు గగుర్పొడుస్తోంది కదూ..ఈ పసివాడు
ఇప్పుడు ఎలా పెద్దవ్వాలి..లోకంలో ఎవరూ లేకపోయినా..ఎలా నెగ్గుకు రాగలడు..దేవుడిదే భారం

Comments