జగన్ మేడలు సరే..మీరు పూరిగుడిసెల్లో ఉంటున్నారా


నా రాతలు కొంతమందికి నచ్చకపోతే..నిరభ్యంతరంగా తిట్టుకోండి..అంతేకానీ..ఫలానా వ్యతిరేక భావజాలమనో..అనుకూల భావజాలమనో ఆరోపించకండి..ఎవడూ  ఇక్కడ నిష్పక్షపాతంగా రాసే వీలు లేదు..అలా రాసే మహానుభావులకు దండాలు..ఎందుకంటే..పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు జనాలను పాలించమని ఐదేళ్లు అదికారం కట్టబెడితే..దాన్ని ఎదుటివారిపై పడి ఏడవడానికే సరిపుచ్చుకుంటే ఆ తప్పు పాలకులదా...వారికి పదవులు కట్టబెట్టిన జనాలదా...!
పైన రౌండప్ చేసిన మాటలే చూడండి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్‌లలో తప్ప ఉండరు..నిజమే మరి..2012 నుంచి ఓదార్పు యాత్ర పేరుతో దాదాపు ఏడాదిన్నర జనంలో ఎంతగా తిరిగాడో గుర్తుంది కదా..అసలు ఆ ఓదార్పు యాత్ర చేయబట్టే కదా..తెలుగు పల్లెల్లోకి ఓ లీడర్ ఇంతగా వెళ్లడమనేది చూసింది..ఇన్ని ఊళ్లు ఉన్నాయా అని తెలిసింది..అప్పుడు ఏ ప్యాలెస్‌లలో పడుకున్నాడు..ఆ తర్వాత 16నెలలు జైల్లోనే కదా ఉండింది..ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చినా  ఎన్నికలు పేరుతో ఊరూరా తిరిగాడా..ఆ తర్వాత అంతేనా..గత ఏడాది క్రితం నుంచి ప్రజాపక్షం పాదయాత్ర ఉన్నదా..ఇంక ఇంతగా జనంలో తిరిగే లీడర్ ని ఎప్పుడైనా చూశారా..ఇలాంటి లీడర్ ప్యాలెస్ లోనే ఉంటాడు..జనం సమస్యలు తెలీవు..చిత్తశుద్దిలేదు  అని డొక్కశుద్ది లేని మాటలెందుకు...ఈ మాటలు మీరు అనకపోతే..టివి చానల్స్ లో ఎందుకు వస్తాయ్..అంటే అవి అలా కవర్ చేయాలనేగా మీ తాపత్రయం..కూతురు లండన్ లో ఉంటే..చూడటానికి వెళ్లినా విమర్శలు చేసిన నోటితో ఈ మాటలు ఎలా అంటున్నారు.. ఓవేళ అవినీతి సొమ్మే కనుక ఉంటే ఎన్డీఏతో అంటకాగిన మొ్దటి మూడేళ్లూ మీరు ఏ గంతలో దాక్కుని ఉన్నారు..అంటే  మీ చేతకానితనంతో కాదా..దొంగలు తప్పించుకుంటుంది..ఉంటే ఈ గట్టున ఉండాలి..లేదంటే ఆ గట్టున ఉండాలి..అంతేకానీ నడిమద్దెలో ఉంటే..ఎటూ కాకుండా పోవడం ఖాయం.



పైన చూడండి ప్యాలెస్‌లను తలచుకుని ఎలా శోకండాలు పెడుతున్నారో..మీ బాధ ఆయనకి ఉన్నాయనా..మీకు లేవనా.. ఈ రెండూ అయితే..తొందర్లోనే కళ్లు మాయం అవడం ఖాయం..అక్కడకు మీరేమైనా అతి సాధారణ జీవితం ఈడుస్తున్నారా..మీ మంత్రివర్గంలో ఓ ప్రముఖుడికి పంటి ఆపరేషన్ కోసం సింగపూర్...అక్కడ ఆ ఖర్చు ఎంతైందో అందరూ చూశారుగా..



అమరావతిలో ఆయన ఉండడు..ఏపీలో పాదయాత్ర చేసి హైదరాబాద్ లో కూర్చున్నాడని పోయినవారం వగచింది మీరే కదా బాబూ..ఇప్పుడెందుకు అక్కడ ఇల్లు కట్టుకుంటే కుళ్లుకుంటున్నారు..పోనీ ఆయనకి స్థలం ఇవ్వకండి..లేదూ ఐటీ రెయిడ్స్ చేయించండి..ఏసీబీతో కేసులు పెట్టించండి..ఏసీబీ మీకూ ఉంది కదా...

విశాఖ సభకి వైఎస్సార్సీపీ జనం తరలిస్తోందంటున్నారు..ఈ రోజున మోడీ ఎక్కడికెల్లినా జనం బ్రహ్మరధం పట్టడానికి ిసిధ్ధంగా ఉన్నారు..పైగా వెళ్తోంది వైజాగ్..అక్కడ ఉన్నది  కూడా బిజెపి ఎంపినే..దానికి ఎవరూ సాయం చేయక్కర్లేదు..ఏ కారణంతో అయినా సరే ప్రస్తుతం 300మంది టెర్రరిస్టులను ఖతం చేసిన సర్జికల్  స్ట్రైక్స్ కి అనుమతి ఇచ్చిన ప్రధానిగా ఆయన క్రేజ్ (ప్రస్తుతానికి) భారీగా పెరిగింది..కాబట్టి మీరు శోకండాలు పెట్టడం మానండి..
అయినా..ఏం చేసినా మీరే చేయాలా..ఏపికి ఏమీ చేయని ప్రధానిని  అడ్డుకుంటాం అని బీరాలు పలకకండి..ఆల్రెడీ గుంటూరు వచ్చి వెళ్లారు ఏం చేశారు..? మీతో ఏం కాదు..ఇక ఆపండి...అందితే జుట్టు  అందకపోతే కాళ్లు అనే రాజకీయసూత్రం చెల్లిపోయి చాలా కాలం అయిపోయింది లెండి

Comments