కేసీఆర్ అసదుద్దీన్ ఒవైసీ ఏపీకి వస్తున్నారా..? రిటర్న్ గిఫ్ట్ వదిలేశారు


డెఫినిట్‌గా చందర్‌బాబుకి రిటన్ గిఫ్ట్ ఇస్తం..లేకపోతే తెలంగాణోళ్లకి మర్యాద తెలీదనుకుంటరా లేదా..అంటూ కేసీఆర్ చెప్పబట్టి మూడు నెలలు దాటిపోయింది..ఇప్పటికీ ఆ ఊసే  లేదు..అమరావతికి వస్తానని చెప్పి కూడా రెండు నెలలు దాటింది. మధ్యలో ఒవైసీ సాబ్ కూడా బాబూ కాస్కో..ఆంధ్రాకి వస్తున్నా అంటూ అనౌన్స్ చేశాడు..ఐనా ఆ సాయిబు గారూ ఇంతవరకూ అయిపూ ఆజా లేరు మరి

ఐతే ఒవైసీ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి చెందిన ముస్లింల లీడర్లను హైదరాబాద్‌లోనే కలిసి మాట్లాడుతున్నాడంటూ టాక్. ఏపీలో తమ వర్గం వారు తమ మాట వింటారనుకున్న ఏ  పదిమందినైనా ఒవైసీ వైఎస్సార్సీపీకి ఓట్లేయమని చెప్పగలరేమోకానీ..ఏపీ అంతా వారి మాట వినకపోవచ్చు..పైగా ఈ ప్రచారం జగన్‌కి లాభం చేకూర్చబోయి నష్టమే చేకూర్చుతుందనే వాదన కూడా బయల్దేరింది

అందుకే అటు కేసీఆర్ కానీ..ఇటు ఒవైసీ కానీ రిటన్ గిఫ్ట్‌ల గురించి మాట్లాడటం తగ్గించేసారు..ఐతే ఇలాంటిదే మరో బంధం ఏపీలో డెవలప్ అయింది అదేంటంటే జనసేనాధిపతి..టిడిపితో ములాఖత్ అయినట్లు ప్రచారం జరుగుతోంది..అందుకు తగ్గట్లుగా వాళ్ల స్వరాలలో మార్పు కూడా స్పష్టంగా కన్పిస్తోంది..ఇది టిడిపికే నష్టం..ఎందుకంటే..విడివిడిగా ఉంటే సీట్లు..ఓట్లు చీల్చవచ్చేమో కానీ..ఇద్దరూ ఒకటే అని తెలిస్తే..ఇక జనసేనకి కానీ టిడిపికి కానీ ఓట్లబదలాయింపు ఉండకపోవచ్చు..

Comments