కుటుంబరావ్‌ పందేలు కాయడంలో మొనగాడా...ఓడిపోవడం ఖాయం ఇదీ షేర్ మార్కెట్ మార్క్


అసలు సిసలు జూదగాళ్లకి ప్రతి అంశంలోనూ పందెం కాయడం సరదా..ఐతే కుటుంబరావ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికా సంఘం(?) ఉపాధ్యక్షులుగా పదవి చేపట్టిన తర్వాత నుంచీ ఇలాంటి పందేలకు దూరంగా ఉన్నట్లు అనుకోవచ్చు..షేర్ మార్కెట్ కి సంబంధించి సలహాలు ఇస్తూ టివి9 ద్వారా..సుపరిచితం అయిన కుటుంబరావ్..ఆ తర్వాత ఇంకో ఛానల్ కి పరిమితం అవడం ఆ తర్వాత చంద్రబాబు పేషీలో చేరిపోవడం చూశాం..

ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయనలోని జూదగాడు ట్రేడర్ బయటకు వచ్చాడో లేక..బిజెపిపైన కసిగా మాట్లాడుతున్నాడో కానీ..ఏపీలో బిజెపి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే...10లక్షలు ఇస్తాడట..అదే కన్నా లక్ష్మీనారాయణకి డిపాజిట్లు దక్కితే 15లక్షలు ఇస్తాడట.ఏపీలో అసలు బిజెపి చచ్చిపోయిన పార్టీ అట..ఓ పార్టీపై కసి..అసహ్యం ఉండొచ్చు కానీ..ఇలా చచ్చిపోయిన పార్టీ..గెలిస్తే డబ్బులిస్తా అంటూ పందేలు కాయడం మాత్రం దారుణం. అది ఏ పార్టీ అయినా కానీ..ఎందుకంటే..ఒక్క తెలుగుదేశం పరిస్థితే చూడండి..ఆ పార్టీ పుట్టిన తర్వాత కాంగ్రెస్ ఓడిన పద్దతికి అసలు మళ్లీ గెలుస్తుందా అనుకున్నారట..కానీ అంతలోపే కాంగ్రెస్ తిరిగి ప్రాణం పోసుకోలేదా..అలానే వైఎస్ దెబ్బకి టిఆర్ఎస్, ఇక్కడ టిడిపి ఉంటుందా అనే డౌట్ 2009లో రాలేదా..కానీ వైఎస్ చనిపోవడంతోనే మళ్లీ ఆ రెండు పార్టీలు పునరుజ్జీవం పొందలేదా..ఇక బిజెపి సంగతి..ఆ పార్టీ కేంద్రంలో ఎంత తిరుగులేని మెజార్టీతో వచ్చిందో 2014లో చూశాం..మరి 1991..టైమ్ చూస్తే..ఈ పరిస్థితిని ఎవరైనా ఊహించగలరా..

అసలు బిజెపి ఏపీలో ఏమైనా బలంగా ఉన్న పార్టీనా..కాదు కదా..అలాంటి పార్టీపై పందేలు ఎందుకు కాయడం..కావాలని సెంటిమెంట్ రెచ్చగొట్టి బిజెపిని బ్రతికించడానికే ఇలాంటి మాటలు ఉపయోగపడతాయ్..చూస్తుండండి కుటుంబరావ్ గారూ...మీ డబ్బులు రెడీ చేస్కోండి..వాళ్లకి డిపాజీట్లు దక్కబోతున్నాయ్ 

Comments