కేసీఆర్ సభ రద్దైంది..ఎందుకో అసలు కారణం తెలుసా


కారు సారు సర్కారు..అయిపోయింది...కారు సారు పదహారు..ఢిల్లీలో సర్కారు అంటూ కొత్త స్లోగన్ అందుకున్న టిఆర్ఎస్‌కి ఇది పెద్ద షాక్..అందులో ఎన్నికలలో గెలిచి మూడు నెలలు కూడా పూర్తిగా నిండకముందే ఇంత ఘోర అవమానం ఎక్కడా జరగదు..సిఎం కేసీఆర్ సభ రద్దు కావడమంటే మామూలు విషయం కాదు..అందులోనూ జనం లేక రద్దు చేసుకోవడమంటే..ఎంత పరువు తక్కువ..

వాస్తవానికి ఏ సభలో అయినా జనం లేకపోతే రద్దు చేసుకోవడం మామూలే..కానీ తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ సభకి జనం రాలేదంటే ఓ పట్టాన నమ్మరు..కానీ వాస్తవంగా జ రిగింది అదే..ఎల్బీ నగర్ స్టేడియంలో పేద్ద..సభ నిర్వహించి సిటీలో సత్తా చాటుదామనుకున్న మల్లారెడ్డికి..తలసాని శ్రీనివాసయాదవ్‌కి బొమ్మ భలే పడింది..ఇద్దరికి ఇద్దరూ మంత్రులే..తమ ఖాన్‌దాన్‌లోని వారికే టిక్కెట్లు ఇప్పించుకున్నారు..మరి అలాంటప్పుడు ఎంత పకడ్బందీగా
సభలకి జనాలను తోలతారు..ఐనా ఇద్దరూ ఎందుకో లైట్ తీస్కున్నట్లు తెలుస్తోంది

అసలు సిటీలో కేసీఆర్ నిజంగా అలా వచ్చి నిలబడితేనే జనం వచ్చి ఇరగబడతారు..ఐనా జనం లేక ప్రచార సభ రద్దు చేసుకోవడం టిఆర్ఎస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక కాంగ్రెస్ వాళ్లు అయితే అప్పుడే  జనం తీర్పు ఇచ్చేందుకు సిధ్దంగా ఉన్నారని..టిఆర్ఎస్ ఓటమి ఖాయమంటూ ఊహలపల్లకిలో ఊరేగుతున్నారు

Comments