మసూద్ అజర్..చచ్చాడా...బతికీ ప్రయోజనం లేదా

మౌలానా...అంటే మతగురువు అని..అంతేకానీ పసి హృదయాల బలహీనతలను అడ్డం పెట్టుకుని వారి మనసుల్లో విషబీజాలు నాటి..ఆత్మాహుతి చేసుకోమనో..ఇంకోరిపై దాడి చేయమనో చెప్పేవారు గురువులు ఎలా అవుతారు..సైతాన్లే అవుతారు..అందుకే అసదుద్దీన్ ఒవైసీ చెప్పిన మాట అక్షరాలా నిజం..మసూద్ గాడు..ఓ సైతానే...
అలాంటి మసూద్ ఇప్పుడు చచ్చాడనే వార్త కాసేపు జనంలో ఆనందాన్ని కలిగించింది..ఐనా ఒక దేశంపై యుధ్దం ప్రకటించిన వాడి బతుకు ఎలా అంతమవుతుందో..అలానే ఇతగాడి  చావు కూడా ర ాసి పెట్టి ఉంది..చరిత్రలో ఇంతవరకూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి..సహజ మరణం పొందినవారు చాలా తక్కువ..అసలు లేరు అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈ మాట అనాల్సి వస్తోంది..ఇలా పదిమంది నోళ్లలో చెడుగానైనా నిలిచిపోవడమే స్వర్గం అయితే..అది జీవితాంతం నరకం అనుభవించిన తర్వాత మాత్రమే దక్కుతుంది.

కాశ్మీర్ భారత్ కి దక్కకూడదు..అలాని పాక్ కూడా తీసుకోరాదంటూ జైష్ ఏ మహ్మద్ పేరుతో ఓ ఉగ్రవాదాన్ని ఏర్పాటు చేసుకుని వరసగా దాడులు చేయిస్తూ..తాను మాత్రం పరాయి దేశంలో దాక్కుంటున్నవాడు ఎలా గురువు అవుతాడు..తాను ఆచరించి చూపిస్తేనే కదా..ఇతరులు కూడా ఆ మార్గంలో పయనించేది..అంటే జిహాదీగా తాను మాత్రం మారడు..ఇతరులను మార్చడమే ఇతగాడి ఉద్దేశం..కాశ్మీర్ లో సూసైడ్ బాంబర్ చచ్చినతర్వాత..అది చేసింది తామే అని ప్రకటించుకున్నారు.. పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడిలో చాలామంది ఉగ్రవాదులు చచ్చారంటున్నారు కానీ..ఆ వివరాలు ఇంకా తెలీదు..ఐతే సడన్ గా అందులో జైష్ ఏ మహ్మద్ హస్తం లేదంటూ పాకిస్తాన్ మినిీస్ట్రీ
వకాల్తా పుచ్చుకుని సర్టిఫికెట్లు ఇస్తూపోతోంది..పైగా మసూద్ అజర్ కి ఆరోగ్యం బాలేదని సన్నాయి నొక్కులు  నొక్కుతోంది..అంటే ఈ మిషన అతగాడిని సీక్రెట్ గా ఇంకో దేశం పంపేసి..కవర్ చేయడానికే చేస్తుందా..అందుకే ఇలాంటి గురువులు బతికుండీ ప్రయోజనం ఏంటి..ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు మీద వచ్చి పడుతుందో అని రోజూ గడగడలాడటమే కదా

Comments