బాబూ ఇక మీరు రెస్ట్ తీస్కోండి..బుద్దా వెంకన్న వ్యాఖ్యల అర్ధం అదేనా


చంద్రబాబుగారిపై అభిమానంతో టిడిపి లీడర్లు ఒక్కోసారి ఆయనకి ఇబ్బందికర పరిణామాలు సృష్టిస్తుంటారు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ..బాబుగారిపై అభిమానం చూపిస్తున్నామనుకుంటూ చిక్కులు తెస్తుంటారు. మొన్నామధ్య కొత్త ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన అశోక్ బాబు డేటా చోరీ కేసులో టిడిపికేంటి సంబంధం..అసలు వ్యక్తిని పట్టుకోండి  అంటూ ఏదేదో మాట్లాడిన సందర్భం చూశాం..

ఇప్పుడు పాపం బుద్దా వెంకన్న మాట్లాడుతూ..చంద్రబాబుగారు భీష్ముడిలాంటివారు..ఆయన శిఖండిపై బాణం వేయరు బిజెపిలో ఒకరు..వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒకరు శిఖండిలా తయారు అయ్యారంటూ కామెంట్లు చేశారు. ప్రధానమంత్రులతోనే పోటీ పడ్డాయన..వీళ్లతో ఎందుకు పోటీ పడతారంటూ వ్యాఖ్యానించారు.. ఆయన భీష్ముడే అయితే నిజంగానే  శిఖండిపై యుధ్దం చేయరు..నిజమే..మరి..కానీ భీష్ముడు ఎవరితరపున యుధ్దంలో పాల్గొన్నాడో వెంకన్నకేమైనా అవగాహన ఉందా

అంటే టిడిపిలో చంద్రబాబుగారు భీష్ముడైతే..మిగిలిన నేతలు కౌరవులు అనుకోవాలి..వారంతా ఎవరో కూడా మన
బుద్దా వెంకన్నగారు వాక్రుచ్చితే వినాలని ఉంది..అలానే కౌరవులకు సాయం చేసిన సైంధవుడిగా ఓ నటుడిని కూడా చెప్తారేమో ఎందుకంటే..ఆయన సరిగానే పోల్చారు..భారతంలో పాండవులను ఒకింతసేపు విజయం సాధించకుండా అడ్డం పడింది సైంధవుడే కదా..మరా సైంధవుడు ఎవరో ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది..పురాణాలను ఎవరికి వారు అన్వయించుకంటూ ఏదో గొప్పగా చెప్పాం అని సంబరపడితే ఇలానే ఉంటుంది

Comments