జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. విజయవాడ పటమట ఏరియాలోని పోలింగ్బూత్లో ఓటర్లు భారీగా బారులు తీరి ఉన్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ నేరుగా ఓటేసేందుకు ప్రయత్నించారు. ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే అక్కడున్నవారిని పక్కకు నెట్టేశారు. ఇంతలో ఓటరు ఒకరు లైన్లో ఉన్నాం కదా..పక్కనుంచి వస్తారెందుకు అని ప్రశ్నించాడు..కాసేపు ఆగినట్లే ఆగిన పవన్ కల్యాణ్ తిరిగి పోలింగ్ బూత్లో ప్రవేశించారు.
ఈ సందర్భంగా అక్కడ పలువురు వృధ్దులు, మహిళలు ఉన్నా సెక్యూరిటీ సిబ్బంది
పక్కకి నెట్టేశారు. అందరికీ లైన్ ఉఁటుంది మీకు మాత్రం పట్టదా అఁటూ కొంతమంది ఓటర్లు అరుస్తున్నా పట్టించుకోకుండా పవన్ పోలింగ్బూత్లోకి వెళ్లడంపై విమర్శలు విన్పిస్తున్నాయ్. ఇంతేనా పవన్ కల్యాణ్ ఓపిక..కనీసం గంటపాటు క్యూలో నిలబడలేని..నేత పాతికేళ్లు రాజకీయం చేయగలడా..ఇఁతేనా ఈయనగారి తీరు అన్పిస్తుంది..పైగా ఆయనకి ఈవిఎంకి...ఈఎంఐకి తేడా తెలీదా..200ఈఎంఐలు పని చేయడం లేదు
ఇది మారాలి..అంటూ అచ్చం చంద్రబాబు వాయిస్నే విన్పించాడు
Comments
Post a Comment