వైన్స్ మర్చంట్స్ బిల్డింగ్ లోననా... వైఎస్సార్సీపీ బాధిత పునరావాస శిబిరం..హ హ


 ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయట...రాక్షసరాజ్యం సాగుతోందట..అందుకే అలాంటి బాధితులను ఓ చోట చేర్చి బాబుగారు ఓదార్చారు..ఇదేంది...ఎవడికైనా కష్టం వస్తే వాడింటికి వెళ్లి కదా మనం సానుభూతో..ఇంకోటో చేసేది..ఇలా అందరినీ ఓ చోటుకి తీసుకురావడం ఏంటి..సామూహిక భోజనాల్లాగా అనకండి..ఇలాగైతేనే టివిలో ఇంతమందిపై దాడులా అని అనుకోవడానికి వీలు ఉంటుంది

ఐతే విచిత్రంగా చంద్రబాబుగారు ఆదేశాలను టిడిపి లీడర్లు లైట్ తీస్కున్నారట..ఛత్..బాబుగారు చెప్పడమేంటి.వీళ్లు వినకపోవడమేంటని..కేకలు పెట్టడంతో..ఆదరాబాదరాగా గుంటూరులో ఓ హాల్‌లో సదరు ఓదార్పు శిబిరం ఏర్పాటు చేశారు..ఇంతకీ ఎక్కడో తెలుసా...జిల్లా వైన్స్ అండ్ మర్చంట్స్ కల్యాణమంటపం.. భలే దొరికింది కదూ...

టైమ్లీ జోకులాగా...నారా లోకేశ్ కూడా ఓ ట్వీట్ వేశారు..అసలే బ్రహ్మీ కామెడీ లేక అల్లాడుతున్నాం..ఎవరైనా ఓ స్కిట్ కొడితే బావుండు అనుకుంటుంటే...ఆయనే ఎప్పుడూ ఆదుకుంటుంటాడు..
మద్యపాన నిషేధం అమలు చేస్తామంటున్న గజదొంగగారూ...సేల్స్ ఎలా పెరుగుతున్నాయంటూ ఓ ట్వీట్ కొట్టాడు..ఆయనంతే అడగకండి..మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని వైసీపీ ఎక్కడ అనౌన్స్ చేసింది అని అస్సలు అడక్కండి..

Comments