అహోబిలంలో గాంధీ, నెహ్రూ బొమ్మలున్నాయట...కాబట్టి..ఇక్కడ కేసీఆర్ బొమ్మ పెట్టాం..మరి ఇలా వాదించుకోక..మళ్లీ ఎవరికైనా అబ్యంతరం ఉంటే..తీసేస్తాం అని చెప్పడం ఏంటి..ఏంటయ్యా ఈ రామాయణంలో పిడకలవేట..ఇప్పటికే ఈటల..రసమయి కామెంట్లతో సతమతం అవుతుంటే..ఈ లొల్లేందంట..ఎలాగైతేనేం బాసుని
కృష్ణదేవరాయలతో పోల్చారు...చాలు గురూ..ఈ జన్మకీ తృప్తి చాలు
తిరుమల కొండ కృష్ణదేవరాయలు కట్టింది కాదు..దానికి ఇతోధికంగా ధన కనక వాహన, భూకైంకర్యాలు సమర్పించి ఉండొచ్చు..ఆయన్ని శ్రీవారిని దర్శించిన మహారాజుగా గౌరవించి ..విగ్రహం పెట్టి ఉండొచ్చేమో కానీ...ఇప్పటి ఈ దొర సంగతి కూడా ఆయనతో సరిపాటి అనుకుంటే అనుకోవచ్చు..కానీ దాన్ని ఒప్పుకోవాలి..అంతేకానీ..అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పారిపోతే ఎలా
ఐతే దేవరాయలు..లేదంటే నెహ్రూ..గాంధీ...ఇదీ ఇప్పుడు మన సారు రేంజ్..మొత్తానికి యాదాద్రి శిల్పుల తెగింపుతో మనకీ ఓ మహారాజు దొరికాడు ఏమంటారు
Comments
Post a Comment