ఈ రాష్ట్రంలోనూ ఓ జగన్ ఉన్నాడు...అప్పులూ ఉన్నాయ్


32 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రం...ఐతేనేం అప్పులు చూస్తే..16000కోట్ల రూపాయలు..అంటే అచ్చంగా ఆంధ్రప్రదేశ్ కి ఉన్న అప్పులతో పోల్చుకోవచ్చు..ఇక్కడ 175మంది ఎమ్మెల్యేలు..అప్పులు రెండులక్షల కోట్లుగా చెప్తున్నారుగా...ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా..ఐతే ఇక్కడి సిఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ జగన్ లానే వ్యవహరిస్తున్నాడు..

ఖర్చులు తగ్గించుకోండంటూ ముందు తానే సింపుల్ గా గవర్నమెంట్ బంగ్లాకి బై చెప్పేశాడు..ఇది జగన్ చేయలేదనుకోండి..అలానే తన కార్ల కాన్వాయ్ లోని అన్నింటినీ అమ్మేస్తున్నాడు..ఒక్కోటి 30 లక్షల రూపాయలు పెట్టి ఎందుకు నాకీ కార్లు..తీసేయండి..రాష్ట్రం అసలే క్లిష ్ట పరిస్థితుల్లో ఉందంటూ !  అలాంటి 40 కార్లని  ఆక్షన్ పెట్టి మరీ అమ్మేయబోతున్నాడు ప్రేమ్ సింగ్..ఇంతకీ రాష్ట్రం పేరు..సిక్కిం...

ఇంకా ఏమేం చేయబోతున్నాడంటే..కేబినెట్‌లోని మంత్రులు  కానీ..సెక్రటరీలకు కానీ ప్రవేట్ ఆస్పత్రులలో ఖర్చులు గవర్నమెంట్ పెట్టుకోదని తేల్చేశాడు.మీ ఇష్టం మీ ఖర్చులతో ట్రీట్ మెంట్ చేయించుకుంటే చేయించుకోండి కానీ..మళ్లీ రీఇంబర్స్ మెంట్ అంటే మాత్రం కుదరదు అన్నాట్ట..మరిప్పుడే నాకో విషయం గుర్తొస్తోంది..అప్పట్లో అంటే 2014-19 మధ్య ఏపీలో ఓ మినిస్టర్ గారు..(లెక్కలో ఆరితేరినాయన) సింగపూరో..మలేషియాలోనో పళ్ల ఆస్పత్రికి వెళ్లి బిల్లు 2 లక్షలు..రీఇంబర్స్ చేయించుకున్నాడు..గుర్తుందా..

జగన్ కి ఇతనకి పోలిక..ఎన్నికలకు ముందు ఇతగాడిపై ఓ కేసు ఉంది..దాన్ని బిజెపి కావాలనే ఎత్తేయించిందనే ప్రచారం జ రుగుతుంది..ఆ డిస్ క్వాలిఫికేషన్ ని ఈసీ రద్దు చేయడంతోనే బైపోల్‌లో పోటీ చేసి సిక్కిం ముఖ్యమంత్రి కాగలిగాడు ప్రేమ్ సింగ్ తమాంగ్. సిక్కిండెమోక్రటిక్  ప్రంట్ హయాంలో ఫశు సంవర్ధకశాఖ మంత్రిగా ఉండగా తొమ్మిదిన్నరలక్షల ముడుపులో...అవినీతికి పాల్పడ్డారని కేసు పెట్టారు..1996-97 మధ్యలో జరిగిందట ఇది..ఐతే ఆ కేసు పెట్టడం మాత్రం 2000 తర్వాత జరిగింది..ఏదీ జగన్ కనుక కాంగ్రెస్ లో ఉండగా బైటికి రాని అబ్జక్షన్స్ ...తర్వాత వచ్చినట్లు..సిక్కిం డెమోక్రటికి ఫ్రంట్  ఇతగాడిపై కేసు పెట్టింది..ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు సిక్కిం క్రాంతికార్ మోర్చా పేరుతో..కింగ్ మేకర్‌గా కింగ్‌గా ఎదిగాడు..బిజెపి అండతో ప్రభుత్వం ఫామ్ చేసాడు

మరి అప్పులు భారీగా ఉన్నాయి కదా..నీ దగ్గరేం ప్లానుంద ిఅంటే..మా సిక్కిం అంటే భూతలస్వర్గం..దాన్నే బలంగా పట్టుకుంటా..ఆ  పాయింట్ నే సేల్ చేస్తా అంటున్నాడు..టూరిజాన్ని..హెల్త్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తాను..బాగా డబ్బులు వసూలు చేస్తా పారిన్ టూరిస్టుల దగ్గర అంటున్నాడు ప్లాన్ బానే ఉంది..


ఐతే వాటన్నింటి కంటే కూడా..మనోడు చూడండి..బిజెపి పెద్దలతో ఎంత వినయంగా ఉంటాడో...



Comments