నిత్యానంద దేశం...పైత్యం పీక్స్ కి



పట్టుకోండి చూద్దాం అంటోన్న వివాదాస్పద గురువు నిత్యానంద దేశం విడిచిపోవడం కాదు..ఏకంగా దేశమే స్థాపించేశాడు...తన దేశానికి కైలాస అనే పేరు కూడా
పెట్టుకున్నాడు. ఐతే ఇవేవీ పట్టనట్లున్న మన పోలీసులు మాత్రం నిత్యానందని పట్టుకుంటాం...జైల్లోకి నెడతాం అంటూ స్టాక్ డైలాగులేస్తున్నారు..మరోవైపు నిత్యానంద మాత్రం తన దేశానికి రాజ్యాంగంతో పాటు..ప్రభుత్వశాఖలు కూడా ఏర్పాటు చేశాం...రండి వచ్చి తరించండి అంటూ సైట్‌లో తెగ ప్రకటనలు గుప్పించేస్తున్నాడు

కొత్త దేముడండీ..కొంగొత్త దేముడండీ..అంటూ అప్పుడెప్పుడో నూతన్ ప్రసాద్ సైతాన్‌గా పాడిన పాట గుర్తుండే ఉంటుంది..ఇప్పుడు రసికశిఖామణి
నిత్యానందుడు కూడా అదేబాటలో తనకంటూ ఓ దేశమే ఏర్పాటు చేసుకున్నాడు..భక్తజనులారా..రాండి...రారండి..ఇదే మనదేశం..ఇతరులతో సంబంధం లేదు
మనకి అంటూ నిత్యానంద ఓ రాజ్యమే స్థాపించుకున్నాడు..

నిత్యానందపై అహ్మదాబాద్ పోలీసులు గత నెలలో పోలీసులు కేసు పెట్టగా..గుజరాత్‌లోనూ నిత్యానంద లీలలు ఇతర రాష్ట్రాలకు
విస్తరించిన విషయం బైటపడింది..ఐతే ఇప్పుడు ఏకంగా ఓ దేశమే ఏర్పాటు చేసుకునే స్థాయికి వెళ్లాడంటే ఓ వైపు కామెడీగానూ..మరోవైపు నిత్యానంద
తెంపరితనానికి ఆశ్చర్యపోక తప్పదు..కైలాస పేరుతో ఈ గుడిసేటి గురువు ఏర్పాటు చేసుకున్న దేశానికి ఓ పాస్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది..రెండు రంగుల్లో
ఉన్న ఈ పాస్‌పోర్ట్ ఇతర దేశాల నుంచి తన కైలాసానికి వచ్చేవారి కోసం ఏర్పాటు చేశాడట..
 2010నాటి కేసులో జైల్లో పడి..బెయిల్ తెచ్చుకున్న నిత్యానంద ఆ తర్వాతి సమయంలో ఈక్వెడార్‌లో ద్వీపం కొన్నాడంటారు..అలా ఆ ద్వీపంలోనే ఇప్పుడు
నిత్యానంద కైలాస పేరుతో తన ఆనందసామ్రాజ్యంలో ఓలలాడుతున్నట్లు తెలుస్తోంది..ఇదిగో ఈ ఫోటో చూడండి..ఇందులో బీచ్ ఒడ్డున శిష్యపరమాణువులు గొడుగు పట్టగా..ఈ గురువు ఎలా కూర్చున్నాడో...ఈ ఫోటో చూస్తే ఓ పిచ్చి పోలీసులూ మీరు నన్నేం చేయలేరు..చూస్కోండి నా దర్జా అన్నట్లుగా లేదూ మనోడి వైఖరి..

 నిత్యానంద దేశానికి ఓ జెండా..దానికో ఎజెండా కూడా తగలబెట్టాడు..ఓ దేశంలో ఎన్ని విభాగాలుంటాయో..దాదాపు అన్ని శాఖలను ఏర్పాటు చేసినట్లు
అతని వెబ్‌సైట్ కైలాస్ డాట్ ఓఆర్జీలో కన్పిస్తుంది. .నిత్యానంద యూనివర్సిటీ గ్లోబల్ డిజిటల్ లైబ్రరీ...ఆఫీస్ ఆఫ్ ది హోమ్ లాండ్ డిపార్ట్ మెంట్..డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్, హౌసింగ్, హ్యూమన్ సర్వీసెస్, ట్రెజరీ, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, హెల్త్ ఇలా రకరకాల విభాగాలు ఏర్పాటు చేసినట్లు సైట్లో కన్పిస్తుంది.. నిజంగా ఇవన్నీ ఏర్పాటయ్యాయో లేదో కానీ.. బిల్డప్ చూస్తే మాత్రం బిజినెస్ బానే ఉన్నట్లనిపిస్తుంది..పైగా ఈ మధ్యే అప్‌లోడ్ చేసినట్లుగా కొన్ని యూట్యూబ్ వీడియోలూ ప్రత్యక్షమవుతున్నాయ్ ఈ సైట్లో..ఐతే ఇవన్నీ కూడా నిత్యానంద ప్రసంగం చేస్తుండగా..బ్యాక్ గ్రౌండ్ మాత్రం గ్రాఫిక్స్‌లో మార్చి పెట్టినట్లు అర్ధమవుతోంది..ఈక్వెడార్ దీవుల్లో ఉన్నట్లు తెలిస్తే..భారత దర్యాప్తు సంస్థలు పట్టుకుంటాయనే భయమే ఇందుకు కారణం కావచ్చు కూడా..
 నిత్యానంద కైలాసదేశంలో 200కోట్ల హిందువులు జనాభాగా చెప్పుకోవడం కన్పిస్తుంది..నిత్యానంద ప్రభుత్వశాఖలతో పాటు నిత్యానంద టివి కూడా ఇక్కడి వారి ఎంటర్ టైన్‌మెంట్ కోసం ఏర్పాటైంది..చరిత్రలో నిలిచిపోయే ఆధ్యాత్మిక గురువులు ఇద్దరే అని..ఒకరు దలైలామా అయితే ఇంకొకళ్లు నిత్యానందేనంటూ కైలాస వెబ్‌సైట్లో సొంతడబ్బా వాయించుకున్నాడు నిత్యానంద..అసలు ఇతగాడి  పైత్యం ఏ స్థాయికి చేరిందంటే సత్యసాయిబాబా తర్వాతి అవతారమే తానంటూ ప్రకటించుకున్నాడు కూడా

 దేశం దాటిపోయినా..  తన లీలలకు అడ్డంకి లేకుండా ఉండేందుకు నిత్యానంద చేసుకున్న ఏర్పాట్లు చూస్తే బిత్తరపోవాల్సిందే..పరాయిదేశంలో ఇఁత భారీ సెటప్ ప్లాన్ చేశాడంటే మరి దానికి ఇప్పటిదాకా వెనకేసిన సొమ్ము బైటికి తీస్తున్నట్లే అనుకోవాలి..ఇప్పటిదాకా నిత్యానంద పాస్‌పోర్ట్ వరకూ
ఎక్స్‌పైర్ అయిన సంగతి విన్నాం కానీ..బ్యాంక్ అక్కౌంట్లు సీజ్ చేసిందీ లేనిదీ తెలీదు..వీటికి తోడు కొత్తగా ఇప్పుడీ కైలాసదేశానికి కూడా విరాళాలు కావాలంటూ
సైట్లో ప్రత్యేకంగా లింకే ఏర్పాటు చేశాడు..అలా ఈక్వెడార్ ఐలండ్స్ లో తానే ఓ దేవుడు..తనకో రాజ్యం..అందులో ప్రజలు..వారి కోసం రాజ్యాంగం అంటూ ఏర్పాటు చేసుకున్నాడంటే నిత్యానంద ఎంత పక్కాగా దేశం విడిచి జంపయ్యాడో అర్ధం అవుతోంది..

Comments