సెపరేట్ సీట్..జగన్ అండ్ కో మాస్టర్ స్ట్రోక్


ప్రత్యేక సభ్యుడిగా గుర్తించమంటూ వల్లభనేని వంశీ కోరడం..స్పీకర్ తాలుకూ ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ స్పందించడం జరిగింది..ఓ స్పెషల్ అంటే..ఏ పార్టీకి చెందని సభ్యుడిగా వల్లభనేని వంశీ ఇకపై కొనసాగుతారు..వారెవ్వా..అంటే ఇక ఈ ప్రత్యేక సభ్యుడు వైఎస్సార్సీపీ పథకాలను చక్కగా  :) శ్లాఘించబోతున్నట్లు
అర్ధమవుతోంది..

మామూలుగా పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీకి జంపైతే..ఫిరాయింపు..రాజీనామా చేసి అధికార పార్టీ నుంచి గెలిస్తే అదెంతో ఇంపు...కానీ ఇలా ప్రత్యేక సభ్యుడిగా కొనసాగడమనేది మాత్రం భలే రాజకీయం..అందుకే వైఎస్ జగన్ మాస్టర్ స్ట్రోక్ ఇది అని చెప్పాలి..

ఇప్పుడు  టిడిపి ఏమని వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయగలదు..ఆ పార్టీలాగా..నలుగురు జంపింగ్ జపాంగ్‌లకు మంత్రి పదవులు కట్టబెట్టారు..కొంతమందికి బికామ్ ఫిజిక్స్ లకు  కార్పొరేషన్ పదవులు కూడా కట్టబెట్టారు..ఇలాంటి రాజకీయంతో పోల్చుకున్నప్పుడు వైఎస్ జగన్ అండ్ కో చేస్తోన్న రాజకీయం మంచిది కాదా..తమ పార్టీలోకి చేర్చుకోలేదు..మంత్రిపదవులూ ఇవ్వడం లేదు..ఉద్దేశాలు ఏవైనా ఇలాంటి సంకేతాలే కదా..జనంలో శభాష్ అన్పించుకునేది.

Comments