జగన్‌ని తిడదాం..కానీ పేర్ని నాని ప్రశ్నలకు జవాబు ఉందా..?


రాజధాని కోసం మూడు పంటలు పండే భూములను వదిలేసి..ఉచితంగా చంద్రబాబుగారి కోసం త్యాగం చేసిన రైతులు ప్పుడు జగన్ ని తిడుతున్నారట...ఎందుకు..
చంద్రబాబుగారు వారి పంటలకు సరైన రేటు ఇవ్వనందుకా
లేక అప్పట్నుంచి ఇప్పటిదాకా ఒక్క పెద్ద కంపెనీ కూడా అమరావతిలో ప్రాజెక్టు తీసుకురానందుకా
లేక వారి పంటలకు చంద్రబాబు ఉచితంగానే లాగేసుకున్నందుకా

కాదు..చంద్రబాబుగారు రైతులకు వారి పంటలకు డబ్బులు కట్టేశారు...సో మొదటి మూడో ప్రశ్నకి సమాధానం వచ్చేసింది..మరి ఎందుకు మద్యలో ఏ ప్రాజెక్టు తీసుకురానందుకా...దానికి జగన్ని ఎందుకు తిట్టడం..
ఎందుకంటే రాజధాని అనబడు బ్రహ్మపదార్ధం కళ్ల ముందే కన్పిస్తుంటే..మిగిలిన ఎకరాలు కూడా రియాల్టీ మాయలో కోట్లకి కోట్లు వచ్చిపడతాయనే ఆశతోనే కదా...
ఆశ ఉండొచ్చు..కానీ దురాశ ఉండకూడదంటూ విజయవాడ గుంటూరువాసులపై చంద్రబాబుగారు ముఖ్యమంత్రి  హోదాలో డైలాగులేసినప్పుడు ఈ ఉక్రోషం ఏమైంది..సరే రైటే...రైతులు(?) ఆవేదన కరెక్టే...మరి ఏబీఎన్..ఈనాడు..మహా...మున్నగు ఛానళ్ల తాపత్రయం ఏంటి..ఎందుకిక్కడ లైవ్లో బూతుల పురాణం విన్పిస్తున్నారు..పేర్ని నాని అడుగుతున్నాడు కింద వీడియోలో ఎవరైనా జవాబు చెప్తారా..


Comments